ప్రేక్షకులను, వినియోగదారులను వాణిజ్య ప్రకటనల ద్వారా అకర్షించి వారికి అరచేతిలో వైకుంఠాన్ని చూపి.. వాస్తవంలో మాత్రం ఏలాంటి రిజల్ట్ లేక బురిడీ కొట్టించే సంస్థలు అనేకం వున్నాయి. మా తేనే నూటికి 90 శాతం నిజమని బెల్లం పాకాన్ని అమ్ముతున్న సంస్థలు కూడా అగ్రశ్రేణి సంస్థలుగా దూసుకెళ్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థలతో పాటు ప్రేక్షకులను తప్పదోవ పట్టించే సంస్థలపై కూడా చర్యలు తీసుకునే నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దం చేస్తుంది.
దీంతో ఇక వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనకు సంస్థలు మంగళం పాడాల్సిందే. లేకపోతే.. ఆ సంస్థలకు శరాఘాతం తప్పడమేకాదు.. చేతి చమురు కూడా వదులుతుంది. ఇప్పటివరకు టీవీల్లో పావుగంట నుంచి అరగంట వరకు కమర్షియల్ బ్రేక్ స్లాట్ తీసుకుని వస్తున్న వాణిజ్య ప్రకటనలకు కూడా ఇక బ్రేక్ పడనుంది. ఎందుకంటే ఇకపై తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.
వినియోగదారులను తప్పుదోవ పట్టించే సంస్థలపై రూ.50 లక్షల జరిమానాతోపాటు వాటిపై మూడేళ్ల నిషేధం విధించనున్నామని కూడా ప్రకటించారు. ఇక అవసరమైతే జైలు శిక్ష కూడా విధించనున్నామని చెప్పారు. గత మూడేళ్లుగా రూపుదిద్దుకున్న ఈ నూతన చట్టం.. కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం త్వరలో వస్తుందని, ఆ తరువాత శీతాకాల సమావేశాల్లో ఈ చట్టం పార్లమెంటు ఉభయ సభల ముందుకు కూడా రానుందని మోడీ చెప్పారు.
అంతర్జాతీయ కన్జూమర్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్ కు హాజరైన ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. మూడేళ్లుగా రూపకల్పన చేస్తున్న ఈ చట్టాన్ని శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. వినియోగదారుల సాధికారతకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మోసపోయిన వినియోగదారులకు త్వరితగతిన పరిహారం అందించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వినియోదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more