కర్ణాటకకు చెందిన ఓ స్వామీలు భక్తిభావంతో భక్తులను బురిడీ కోట్టింది.. ఆ మీదట నటీమణుల చేత సరససల్లాలలలో తమ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇప్పటికే నటి రంజిత రాసలీలల వ్యవహారం బయటపడి.. అమె జీవితం అబాసుపాలవ్వగా.,. తాజాగా మరో నటికి కూడా ఇదే దుర్భర పరిస్థితి ఎదురైంది. అమెను కూడా ఓ బాబా తన కుటిల భక్తితో వంచించి.. అమెతో శృంగారంలో ఓలలాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కర్నాటకలో వైరల్ గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. యలహంకలోని మద్దేవనపురంలో ఓ మఠం ఉంది. ఆ మఠాధిపతి నంజీశ్వర్ స్వామీజీ.. మఠంలోని ఓ గదిలో ఓ మహిళతో రాసలీలలకు పాల్పడ్డారు. ఆ మహిళ ఓ సినీనటి అని తెలుస్తోంది. కాగా, ఓ రహస్య కెమెరా ద్వారా స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది. దీంతో, కర్ణాటకలోని స్థానిక టీవీ ఛానెళ్లలో స్వామి వారి రాసలీలల దృశ్యాలను ప్రసారం చేస్తున్నట్టు సమాచారం.
స్వామీజీ వ్యవహారంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు సిటీ ఈశాన్య జోన్ డీసీపీ గిరీశ్ మాట్లాడుతూ, ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే చర్యలు చేపడతామని చెప్పారు. సుమారు ఐదొందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం కింద 220 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు.
ఆ మఠాధిపతి గురించి చెప్పాలంటే.. పర్వతరాజ్ శివాచార్య స్వామి కుమారుడు నంజీశ్వర్ స్వామిజీ అలియాస్ దయానంద్. 2011లో ఈ మఠానికి పీఠాధిపతి కావాలని విఫలయత్నం చేశాడు. ఆ తర్వాతే తన పేరును నంజీశ్వర్ స్వామీజీగా మార్చుకుని క్రమంగా మఠాధిపతి అయ్యాడు. ఈ మఠానికి సంబంధించిన భూములను దుర్వినియోగం చేయడం, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆయనకు కొత్తేమీ కాదని కొంతమంది భక్తుల ఆరోపణ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more