తెలుగు రాష్ట్రాలలో తన సత్తాను చాటుకునే ప్రయత్నాలకు, కార్యచరణను అమలు చేసేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా జనసేన పార్టీ సమాయత్తం అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాలలో పోటీకి తాము సిద్దమని అయితే తాము గెలుస్తామని నమ్మకం వున్న నియోజకవర్గాల్లో మాత్రం ముమ్మర ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తామని ఇదివరకే జనసేన పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్యచరణ అమలుకు, వ్యూహరచనకు, కీలకమైన సమావేశాలను నిర్వహణను చేపట్టేందుకు వేదిక అవసరం.
ప్రతీసారి ఎక్కడో ఒక వేదిక కాకుండా ప్రధాన కార్యాలయంలోనే వీటిని ఇప్పటి వరకు అన్ని పార్టీలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దీంతో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటవుతుందన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యింది,,? ఈ అంశంలో రెండు రాష్ట్రాల కార్యకర్తల వద్ద భిన్నమైన సమాధానలు వున్నాయి. పార్టీ ఆవిర్భావం ఏపీ పాలిటిక్స్ పైనే తన దృష్టిని కేంద్రీకరించిన అధినేత పవన్ కళ్యాణ్ అంధ్రప్రదేశ్ లోని తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే జరుగుతుండగా, అది సత్యదూరమని.. దానికి జనసేన చెక్ పెట్టింది పార్టీ.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే పార్టీ హెడ్ క్వార్టర్ సిద్ధం చేసే పనిలో జనసేన పార్టీ నిమగ్నమై ఉంది. తాము అంధ్రప్రదేశ్ రాజకీయాలపై అమితాసక్తిని కనబర్చినా.. దగాపడిన ఏపీ తమ్ముళ్లకు ప్రత్యేక హాదా కావాలని నినదించినా.. అదే సమయంలో తెలంగాణలోనూ తాము ఎన్నికల బరిలో దిగుతామని ఇప్పటికే స్పష్టం చేసిన పార్టీ అ మేరకు సంకేతాలనే ఇచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ లోనే తమ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని స్పష్టం చేసింది. అంతేకాదు హైదరాబాద్ రెండు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో వుంటుందని కూడా పేర్కోంది.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పార్టీ కార్యాలయంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, మరో పది రోజుల్లో అన్ని పూర్తవుతాయని పేర్కోంది. పార్టీ కార్యాలయంలో ఐటి విభాగాన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలో ప్రజాయాత్రని చేపట్టాలని భావిస్తున్న జనసేనాని అందుకు తగ్గట్లుగా ప్రచారం కోసం పార్టీ ఐటి విభాగాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. కాగా పశ్చిమ గోదావరి లో ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఏలూరులో ఓ ఇంటిని కొనాలని పవన్ కళ్యాన్ భావించిన విషయం వాస్తవమే. కానీ పార్టీ కార్యాలయాన్నీ మాత్రం అక్కడ స్థాపించారని జనసేన వర్గాల సమాచారం.
#JanasenaParty Office renovation work is under process pic.twitter.com/wv3bQgTrQk
— JanaSena Party (@JanaSenaParty) October 13, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more