తిరుమలలో మరో అపచారం చోటుచేసుకోవడం అది కాస్తా కొత్త వివాదానికి దారితీయడం.. దీంతో ఈ వివాదాన్ని ఎలా సద్దుమణిగించాలో తెలియని తిరుమల తిరుమల దేవస్థానం బోర్డు అధికారులు ఇది శరాఘాతంలా పరిణమించింది. ఈ వివాదానికి అజ్యం పోసింది మాత్రం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులే కావడం గమనార్హం. శ్రీవారి బ్రహోత్సవాల వేడుకలలో భాగంగా గత రెండేళ్లుగా అర్చక వృత్తికి దూరంగా వున్న తన కుమారుడికి ఏకంగా సూర్యప్రభ వాహనం సేవలలో పాల్గోనేందుకు అనుమతించడమే ఇందుకు కారణమైయ్యింది.
దీనిని వ్యతిరేఖించిన టీటీడీ మిగతా అర్చకులు.. విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అర్చక బృందంలో అత్యధిక మంది ఇది సమంజసం కాదని అక్షేపించడంతో.. వెంకటపతి దీక్షితులకు ఆ అవకాశాన్ని కల్పించకుండా.. వేరే అర్చకుడిని అ సేవలకు నిర్వహణకు నియమించారు దేవాలయ బోర్డు అధికారులు. దీంతో ఆలయ అర్చక వ్యవహారాలలో బోర్డుకు ఏం సంబంధముందని ఏకంగా ఆలయ డిఫ్యూటీ ఈఓ కోదండ రామారావును నిలదీశారు రమణ దీక్షితులు. వివాదం రేగిన నేపథ్యంలో అలయ బోర్డు ప్రధాన అర్చకులుకు నోటీసులు జారీ చేసిందని కూడా సమాచారం.
ఇదిలావుండగానే రమణ దీక్షితులు.. తన కుమారుడు వెంకటపతి దీక్షితులు, ఇద్దరు మనవళ్లతో కలిసి మహద్వారం ద్వారా ఉదయం ఐదున్నరకు ఆలయ ప్రవేశం చేశారు. శ్రీవారి సన్నిధికి చేరుకుని కుమారుడితో కలిసి కులశేఖరపడి దాటి గర్భాలయంలోకి చేరుకున్నారు. రమణదీక్షితులుకు గర్భాలయ ప్రవేశ అర్హత ఉన్నప్పటికీ.. తన కుమారుడు, మనవళ్లు గర్భాలయంలోకి వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. వీఐపీ విరామ దర్శనం సమయంలో గర్భాలయంలోకి చేరుకుని కుమారుడి ద్వారా స్వామివారికి హారతి ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయాన్ని అలయ బోర్డు అధికారులు కూడా స్పందిస్తూ.. ఈ విషయం వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. గత రెండేళ్లుగా ఆలయ విధులకు దూరంగా ఉన్న వెంకటపతి దీక్షితులు గర్బాలయంలోకి ఎలా ప్రవేశిస్తారని, స్వామివారికి ఎలా హారతిని ఇస్తారని మిగతా అర్చకులు టీటీడీ బోర్డు అధికారులను నిలదీస్తున్నారు. దీంతో వెంకటపతి దీక్షితులు గర్భాలయ ప్రవేశాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సీసీ టీవీ చిత్రాలను సేకరించారు. దీని ఆధారంగా నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more