ఇద్దరూ కాకీ దుస్తులు ధరించి విధులు నిర్వహించే వారే. అయితే ఒకరు పోలీసు కానిస్టేబుల్ కాగా, మరోకరు అర్టీసీ కండక్టర్. నిబంధనల ప్రకారం ఎవరి విధులను వారి నిర్వహిస్తుంటారు. అయితే వీరిద్దరూ అనుకోకుండా ఒకరికోకు వాగ్వాదానికి దిగి అది కస్తా ఘర్షణకు దారి తీస్తే.. తమ గూటికి చెందిన పక్షిదే తప్పైనా రాజీ కుదర్చి పంపారు పోలీసులు. అదే కండక్టరుదే తప్పని తేలివుంటే.. పోలీసుల విధులను అటంకపర్చినందుకు కండక్టరుపై కేసు నమోదు చేసి.. సెక్షన్ల మీ సెక్షన్లు పెట్టి మరీ కటకటాల వెనక్కి నెట్టేవారు. ఈ తతంగానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అధికారంలోకి వచ్చి రాగానే ముందుగా పోలీసులకు వెతనాలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. అదే సమయంలో వారికి కొన్ని సూచనలు కూడా చేసింది. చిన్న చిన్న విషయాలకు చేయి చాచడం మానేయండీ.. మీరు గౌరవంగా బతికేందుకు మీ వేతలను అర్థం చేసుకుని వేతనాలను పెంచుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసినా.. అలావాటు పడిన ప్రాణం.. ఎక్కడ అగుతుంది. అందుకనే బస్సులో ఓ మహిళా కానిస్టేబుల్ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసింది. పైగా మహిళా కండక్టరుతో వాగ్వాదానికి దిగింది. అంతటితో అగకుండా దాడికి కూడా పాల్పడింది. కేవలం టిక్కెట్ తీసుకోమ్మని చెప్పినందుకే ఇదంతా జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దీంతో నేరుగా బస్సును నవాబుపేట పోలిస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన డ్రైవర్.. పంచాయితీని అక్కడే పెట్టించగా, తమ గూటి పక్షి, అందులోనూ తమ స్టేషన్ లోనే విధులు నిర్వహించే కానిస్టేబుల్ రజిత కుమారీని వెనకేసుకువచ్చి.. రాజీ కుదిర్చారు. ఇక స్టేషన్ లో తాను ఐడి కార్డు లేదని, జిరాక్స్ చూపించినా టిక్కెట్ తీసుకోవాలని కండక్టర్ శోభారాని నిలదీసిందని.. డ్రెస్ లో వున్నా టిక్కెట్ తీసుకోవాలా..? వారెంట్ చూపించాలట అంటూ గద్దించింది. అమెను శాంతపర్చిన పోలీసులు.. కండక్టర్ శోభారాణిని సముదాయించి పంపడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
టిక్కెట్ తీసుకోవాలని చెప్పినందుకు కానిస్టేబుల్ రజిత కుమారి తనపై దాడి చేసిందని, అమె వద్ద వారెంట్ లేకుండా బస్సు ఎక్కిందని, అయితే పద్దతిగా టికెట్ తీసుకోవాలని చెప్పినా.. వితండవాదానికి తెరలేపుతూ అమె మాట్లాడిందని, చెక్కింగ్ స్వాడ్ వస్తే కానిస్టేబుల్ మూలంగా తానకు ట్రాక్ రికార్డు దెబ్బతింటుందని కండక్టర్ శోభారాణి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. అయితే కేసులు గట్రాలు ఎందుకు డ్యూటీ వదులుకుని స్టేషన్, కోర్టులు ఎం తీరుగుతారని కండక్టర్ తో రాజీ కుదిర్చారు పోలీసులు. కాగా, బస్సులో ఇరువురు ఘర్షణ పడుతున్న సమయంలో అందులో ఉండే ఓ ప్రయాణికుడు వీడియో తీసి వాట్సాప్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది ఈ ఘటనపై ఎస్పీ అనురాధ విచారణకు ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more