స్నేహితురాలిపై అత్యంత దారుణంగా వ్యవహరించి.. లైంగిక దాడికి యత్నించి.. సదరు దృశ్యాలను తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించి.. రాక్షసానందం పోందిన కనిగిరి పైశాచిక మృగాలను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపినా.. ఆ మృగాళ్లపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మగమృగాళ్ల నుంచి బాధితురాలి కుటుంబానికి ఎప్పటికీ ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను అదేశించింది
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి చంద్రబాబు వివరాలను తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలి తల్లి పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అరోపించిన నేపథ్యంలో సదరు విమర్శలపై కూడా సీఎం పోలీసులతో వాకాబు చేసినట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు తమ పిర్యాదుపై స్పందించలేదని, దీంతో నిందితులు సోషల్ మీడియాలో ఆ ఘటన తాలుకు వీడియోలను పోస్ట్ చేశారని అమె అరోపించారు. పోలీసులు అప్పుడే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వుంటే ఇలా జరిగేది కాదని, నిందితులు తమను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితుల తరపున వకాల్లా పుచ్చుకన్నారని అమె అరోపించారు. మీ అమ్మాయే అల్లరవుతుందని సముదాయించే ప్రయత్నం చేశారని బాధితురాలి తల్లి అరోపించారు.
కనిగిరి ఘటనలో బాధితురాలని పరామర్శించాలని, అమె కుటుంబసభ్యులను ఓదార్చాలని కూడా మహిళా కమీషన్ ను సర్కార్ అదేశించిన నేపథ్యంలో ఇవాళ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారీ బాధితురాలిని పరామర్శించారు. పిచ్చి కుక్కలా బాలికపై తెగబడిన యువకులను చట్టం కఠినంగా శిక్షిస్తుందని అమె అన్నారు. అమెతో పాటు వైసీపీ నేతలు కూడా బాధితురాలిని అండగా వుంటామని భరోసా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more