స్నేహితురాలిపై అత్యంత దారుణంగా వ్యవహరించి.. లైంగిక దాడికి యత్నించి.. సదరు దృశ్యాలను తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించి.. రాక్షసానందం పోందిన కనిగిరి పైశాచిక మృగాలను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపినా.. ఆ మృగాళ్లపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మగమృగాళ్ల నుంచి బాధితురాలి కుటుంబానికి ఎప్పటికీ ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను అదేశించింది
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి చంద్రబాబు వివరాలను తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలి తల్లి పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అరోపించిన నేపథ్యంలో సదరు విమర్శలపై కూడా సీఎం పోలీసులతో వాకాబు చేసినట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు తమ పిర్యాదుపై స్పందించలేదని, దీంతో నిందితులు సోషల్ మీడియాలో ఆ ఘటన తాలుకు వీడియోలను పోస్ట్ చేశారని అమె అరోపించారు. పోలీసులు అప్పుడే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వుంటే ఇలా జరిగేది కాదని, నిందితులు తమను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితుల తరపున వకాల్లా పుచ్చుకన్నారని అమె అరోపించారు. మీ అమ్మాయే అల్లరవుతుందని సముదాయించే ప్రయత్నం చేశారని బాధితురాలి తల్లి అరోపించారు.
కనిగిరి ఘటనలో బాధితురాలని పరామర్శించాలని, అమె కుటుంబసభ్యులను ఓదార్చాలని కూడా మహిళా కమీషన్ ను సర్కార్ అదేశించిన నేపథ్యంలో ఇవాళ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారీ బాధితురాలిని పరామర్శించారు. పిచ్చి కుక్కలా బాలికపై తెగబడిన యువకులను చట్టం కఠినంగా శిక్షిస్తుందని అమె అన్నారు. అమెతో పాటు వైసీపీ నేతలు కూడా బాధితురాలిని అండగా వుంటామని భరోసా ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more