హర్యానాలో సంచలనం సృష్టించిన జిందాల్ న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులోని నిందితులకు చంఢీగడ్ హైకోర్టులో ఊపశమనం లభించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా డిజిటల్ అధారాలను పరిగణలోకి తీసుకుని తమ సహచర న్యాయవిద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఇద్దరికి ఇరవై ఏళ్లు, మరోకరికి ఏడేళ్ల జీవిత ఖైదు శిక్షను ఖారరు చేసిన కింది కోర్టు తీర్పును కొట్టివేస్తూ చండీగఢ్ హైకోర్టు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. మొట్టమొదటిసారిగా వాట్సాప్ ఛాటింగ్ను సాక్ష్యంగా పరిగణిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేసినా అది ఉన్నత న్యాయస్థానంలో నిలువలేకపోయింది.
ఈ సందర్భంగా హైకోర్టు ద్విసభ్య బెంచ్ బాధితురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం విశేషం. బాధితురాలి మానసిక పరివర్తనే జరిగిన అఘాయిత్యానికి కారణమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘కాస్త కూడా పరిణితి లేకుండా అమ్మాయి వ్యవహరించింది. యువకులతో మరీ సానిహిత్యంగా మెలిగింది. పైగా లైంగిక పరమైన కోరికలతోనే స్నేహితులతో అసభ్యమైన ఛాటింగ్ చేసిందని ఈ విషయాలన్ని యువతి విచారణలో అంగీకరించిందని పేర్కోంది. వైద్యులు కూడా యువతి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదన్న విషయాన్ని తేల్చారని బెంచ్ తెలిపింది.
యువతి మానసిక స్థితి సరిగా లేనప్పుడు బలవంతంగా లైంగిక దాడి చేశారన్న ఆరోపణలు సరికాదని అభిప్రాయపడింది. అదే సమయంలో నిందితులలో ఇద్దరికి ఏకంగా 20 ఏళ్లు, మరోకరికి ఏడేళ్ల కఠిన కారాగారా శిక్షను కూడా విధించాల్సిన అవసరం లేదని బెంచ్ పేర్కొనింది. విద్యార్థుల భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకునే తాము ఈ తీర్పు వెలువరిస్తున్నామని జడ్జిలు మహేష్ గ్రోవర్, రాజ శేఖర్ అట్టిరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే బాధితురాలికి నిందితులు పది లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని అదేశించింది.
సోనేపట్ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్ అనే విద్యార్థులు తమ జూనియర్ అమ్మాయిపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె నగ్న చిత్రాలను సేకరించి, అందరితో పంచుకోవడంతో పాటు, యాపిల్ ఐ క్లౌడ్ లో దాచారు. వీరి మధ్య సాగిన అన్ని సంభాషణలు వాట్సాఫ్ లో భద్రంగా ఉండిపోయాయి. వీటి అధారంగా నమోదైన కేసును విచారించిన సోనీపేట్ కోర్టు నిందితులను దోషులుగా పరిగణించి శిక్షలను ఖారారు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more