అరచేతిలో వైకుంఠం చూపి, వారు కష్టంతో సాధించుకున్న ఏ పనినైనా తమ దయ వల్లే సాధ్యమైంయ్యిందని చెప్పుకుని.. అదను చూసి వారిపై లైంగిక దాడులకు తెగబడుతున్న సాధువుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. పంజాబ్, హర్యానాలో గుర్మిత్ రామ్ రహీం సింగ్, కర్ణాటకలో నిత్యానంద, అశారాం బాపు ఇలా ఎందరెందరో తమ భక్తులపై అత్యాచారాలకు పాల్పడిన వాల్లే. ఏకంగా లక్షల సంఖ్యలో భక్తులున్న స్వామీజీలే తమ భక్తులపై దారుణాలకు పాల్పడుతున్న క్రమంలో దొంగబాబాల జాబితా కూడా విడుదలైంది.
స్వామీజీల అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్న క్రమంలోనే మరో బాబా కూడా తానేం తక్కువా అన్నట్లుగా తన మనవరాలి వయస్సులో వున్న ఓ భక్తురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం బయటకు చెబితే తాన భక్తులు ఏం చేస్తారో తనకే తెలియదని కూడా హెచ్చరికలు చేశారని, తన భక్తులు ఉన్నత స్థాయిలో వున్న పోలీసు అధికారులు వున్నారని బాధితురాలిని బెదిరింపులకు గురి చేశారు. చివరకు ధైర్యంతో తన తల్లిదండ్రుల అండతో ఏకంగా ఉత్తరాఖండ్ డీజీపీకి బాధితురాలు పిర్యాదు చేయడంతో అతని అకృత్యం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్ షిప్ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదే పట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. తాను తొలిసారి అర్జించిన వెతనాన్ని బాబుకు విరాళంగా ఇచ్చేందుకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది. హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన 70 ఏళ్ల బాబా, తన మనవరాలి వయస్సులో వున్న 21 ఏళ్ల యువతిని చూసి తలుపు గడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు.
దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో ఆమె తన సోదరినికి తీసుకుని బిలాస్ పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు నిమిత్తం బాబా ఆశ్రమానికి వెళ్లారు. అయితే ఆశ్రమంలో ఆయన కనిపించలేదు. వేరే దగ్గర ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులకు ఐసీయూలో బాబాను చూసి విచారించకుండా వెనుదిరిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more