హైదరాబాద్ నగరవాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రానుంది. నగరవాసుల నిరీక్షణ ఫలించిన క్షణం అసన్నమైంది. ఏకంగా నాలుగువందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరంలో తొలిసారిగా మెట్రో రైలు తొలికూత పెట్టేందుకు సిద్దమవుతుంది. గత కొన్నేళ్లుగా పనులు జరుగుతున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. పలు వాయిదాల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మెట్రోలో ప్రయాణిస్తామా..? అన్న నగరవాసి నీరీక్షణకు నవంబర్ 28 ముహూర్తం కుదిరింది.
అదే రోజున హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్రమోడీ.. లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించి అందులో కొంతదూరం మేర ప్రయాణించనున్నారు. ఈ మేరకు నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆ లేఖను పోస్ట్ చేస్తూ మెట్రో ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ధ్రువీకరించారు. నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మెట్రోను ప్రారంభించాల్సిందిగా ప్రధానికి సీఎం లేఖ రాశారని కేటీఆర్ తెలిపారు.
మెట్రో రైలును ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీని ఈ ఏడాది మే 25న సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినట్లు కేటీఆర్ ట్వీట్ చేసిన లేఖలో ఉంది. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తాజా లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ సదస్సును ప్రారంభించడానికి ఒప్పుకున్న మీరు.. ఇదే పర్యటనలో భాగంగా మెట్రోరైలును కూడా ప్రారంభించాలర’’ని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ ఆ లేఖలో కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more