ఉపాధ్యాయ అశావహులు గత కొన్నేళ్లేగా ఎంతో అసక్తితో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో 8,452 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేస్తూ.. వాటికి సంబంధించిన వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యా ఆశావహులకు శుభవార్త అందినట్లైంది.
కాగా ఉపాద్యాయ ఉద్యోగ అశావహులు తొలినుంచి కోరుకున్నట్లుగానే పాత జిల్లాల ప్రాతిపదికనే ఈ ఉపాధ్యయ పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు, ఆ మేరకు సంఖ్య, పేర్లు పొందుపర్చి ఉన్న కారణంగా సదరు ఉత్తర్వులను రద్దు చేయకుండా కొత్త జిల్లాల పరిధి ప్రకారం ఖాళీల భర్తీ సాధ్యం కాదని న్యాయశాఖ కూడా సలహా ఇవ్వడంతో ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యయ పోస్టులను భర్తీని చేపట్టాలని యోచిస్తే.. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు, మరికొన్ని జిల్లాల్లో తక్కువ ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేకించి రూరల్ జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు, అర్బన్ జిల్లాల్లో తక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఏర్పడుతుంది. దీంతో అలాంటి వత్యాసాలతో అశావహులకు అన్యాయం జరగకుండా పాత జిల్లాల ప్రతిపదికనే ఉపాధ్యయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు ఇప్పటికే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి విన్నవించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more