గణేశ్ ఉత్సవాలకు పెట్టింది పేరైన ఖైరతాబాద్ వినాయకుడిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ.. ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్దలతో.. నవరాత్రులను జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తులో వుండే గణనాధుడు విగ్రహ ఏర్పాటులతో అధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఈ భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించే ఈ వినాయకుడు నిమజ్ఝనం తరువాత కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరకుంటారు. ఎందుకిలా.. నవరాత్రులన్ని రోజులే కదా భక్తులు వుంటారు.. ఆ తరువాత ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు ఎందుకు చేరుకుంటారు. అంటే.
అందుకు ముఖ్యకారణం ఖైరతాబాద్ గణపయ్య చేతిలో భారీ క్రేన్ సాయంతో వుంచే లడ్డూ ప్రసాత వితరణ. అవునండీ నవరాత్రులన్ని రోజులు వినాయకుడి చేతిలో అలంకరించబడే ఈ లడ్డూ ప్రసాదాన్ని తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా తయారు చేసి పంపుతారు. ఇక ఈ ప్రసాదం లభిస్తే తమకంతా శుభమే జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. దీంతో నిమజ్జనం పూర్తైన తరువా త కూడా ఈ లడ్డూ ప్రసాద వితరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా..? అంటూ భక్తులు వేచి చూస్తారు.
ఈ నమ్మకం ఏడాదికేడాది అంచెలంచెలుగా పెరుగుతూ.. భక్తులు ఒకరు నుంచి మరోకరు మహా లడ్డూ ప్రసాదం గురించి తెలుసుకుని గతేడాది ప్రసాద వితరణ నిర్వాహకులతో పాటు ఇటు పోలీసులు, అటు వాలెంటీర్లకు కూడా పరీక్షగా మారింది. ప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో.. తోపులాటలు, లాఠీచార్జ్ లతో పోలీసులు, నిర్వాహకులు చెడ్డపేరు అపాదించింది పెట్టింది. దీంతో తాపేశ్వరం లడ్డూను ఇకపై ప్రసాదంగా పెట్టరాదని నిర్వాహకులు భావించారు. దీంతో ఏళ్లుగా వస్తున్న అనవాయితీకి ఇప్పుడు చెక్ పడుతుంది.
ప్రత్యేకంగా తయారు చేయించి పంపుతున్న 500 కిలోల లడ్డూను తాము ఉచితంగా అందిస్తుండగా, దానిని వితరణ చేయడంలో విఫలమై.. ఇక ఈ ప్రసాదం వద్దూ అని నిర్వాహకులు చెప్పడం.. లడ్డూ ప్రసాదం స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డూను స్వామి చేతిలో అలంకరిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఇక ఈ లడ్డూను హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని గణేషుడి చేతిలోకి వెళ్లనుంది. ఈ మేరకు సురుచీ స్వీట్స్ సంస్థ యజమాని పోలిశెట్టి మల్లిఖార్జున రావు సన్నిహిత వర్గాల సమాచారం.
దీంతో హైదరాబాద్ వినాయకుడికి తాము పంపే లడ్డూను ఇకపై ఫిల్మ్ నగర్ వినాయకుడు అందుకునేలా చేయనున్నారు. ఫిలింనగర్ లో ప్రతిష్ఠింపబడే వినాయకుడికి 500 కిలోల మహాలడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్టు ఆయన స్వయంగా తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే నవరాత్రుల పాటు పూజలందుకుని ఆ తరువాత భక్తుల కొంగుబంగారం కానున్న ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ఫిల్మ్ నగర్ గణేషుడికి చేతిని అలంకరించనుంది. దీంతో పాటుగా తెలంగాణ భవన్ పక్కనే ఉన్న పూరీ జగన్నాథాలయానికి 100 కిలోల లడ్డూను ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more