ఇప్పటికే దేశంలో పర్యటిస్తున్న విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గింది. దేశంలో మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో నమోదవుతున్న కేసులు సంఖ్య కూడా అంతకంతకూ పెగుతుంది. ఈ క్రమంలో మన దేశ పర్యటనకు వచ్చే వారికి విదేశాలు ఏకంగా హెచ్చరికలు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న క్రమంలో ఇలాంటి అపఖ్యాతులను దూరం చేయడంతో తమ వంతు పాత్రను పోషించాల్సిన ప్రొఫెసర్లు ఏకంగా విదేశీ వనితనే తన కామవాంఛ తీరుస్తే అమె కోరిక నేరవేస్తానని చెప్పడం ఎంత దారుణం.
దేశం కానీ దేశం నుంచి ఉన్నత చదువుల కోసం భారతదేశానికి వచ్చిన 31 ఏళ్ల ఇరానీ మహిళకు ఈ పరిస్థితి ఎదురైంది. సాక్షాత్తూ ఓ ప్రొఫెసరే ఆమెతో తన కోరిక తీరిస్తే పీహెచ్డీ సీటు ఇస్తాననడంతో అమె నిర్ఘాంతపోయింది. అకౌంట్స్ లో పీహెచ్డీ చేనేందుకు భారత్ వచ్చిన ఇరానీ వనితకు ఇదే జరిగింది. ఇందుకోసం ఇరాన్ నుంచి మహారాష్ట్రలోని ఫూణేకు చేరకుంది. పూణే నగరంలో స్థానికంగా గల యశ్వంతరావు మొహితే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్సు అండ్ కామర్స్ కళాశాలకు వచ్చింది. తనకు పీహెచ్డీ సీటు ఇవ్వాలని ప్రొఫెసర్ శివాజీ బొర్హాడే (53) ని కోరింది.
తనతో లైంగిక సంబంధం పెట్టుకొని తన కోరిక తీరిస్తే పీహెచ్డీ సీటు ఇస్తానని ప్రొఫెసర్ సెలవియ్యడంతో ఆ ఇరాన్ మహిళ షాక్కు గురైంది. వెంటనే ప్రొఫెసర్ గదిలోనుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లిన ఇరాన్ మహిళ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి తన కోరిక తీర్చమన్న ప్రొఫెసరుపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రొఫెసరు శివాజీ బొర్హాడే పై ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడైన శివాజీ బొర్హాడే తన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్ అయిన శివాజీ బొర్హాడే ఇద్దరు అమ్మాయిలకు తండ్రి అయి ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ తీరుపై పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more