నగరాలు, పట్టణాల్లో పేదరిక నిర్మూలణ కోసం అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎవరూ దుర్వినియోగం చేసుకోకుండా కట్టడి చేసే విధానంలో భాగంగా చర్యలను తీసుకుంది. దీంట్లో బాగంగా మీ ఇంటో బైక్ వున్నా.. ఫ్రిడ్జి వున్నా మీరు ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు. కేవలంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారు పాలిథిన్ కవర్ల గుడిసెల్లో వుంటున్న వారు మాత్రమే ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా తేల్చేసింది.
తమ పథకాలను కేవలం అర్హులకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తాజాగా సాంఘిక అర్థిక సర్వే (సోష్యొ ఎకనామిక్ సర్వే)ను బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయగా, అ కమిటీ ఈ మేరకు కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా ఇంట్లో ఫ్రిడ్జ్ వున్నా వారు కేంద్ర పథకాలకు అర్హులు కాదంటూ బాంబులాంటి విషయాన్ని నివేదికలో పొందుపర్చింది. కమిటీ సమర్పించిన నివేదిక అధారంగా కేంద్రం తమ పథకాలను అర్హులకు వర్తింపజేసేందుకు అడుగులు వేస్తుంది.
నగరాలు, పట్టణాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులు కాదంటూ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పొందుపర్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎవరెవరికీ వర్తింపజేయాలన్న విషయాన్ని బిబేక్ దేబ్రాయ్ కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది.
కమిటీ నివేదికలో కండిషన్స్ ఇవే
1. నాలుగు గదుల ఇల్లున్నా అనర్హులే
2. కారు నాలుగు చక్రాల వాహనం వున్నా అనర్హులే
3. ఇంట్లో ఎయిర్ కండీషనర్ వున్నా అనర్హులే
4. ఇక నాలుగో క్యాటగిరీలో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ద్విచక్రవాహనం వీటిలో ఏ ఒక్కటి వున్నా కేంద్ర సర్కారు సంక్షేమ పథకాలకు మీరు అర్హులు కాదని కమిటీ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more