కాంగ్రెస్ పార్టీకి చెందిన గుజరాత్ ఎమ్మెల్యేలకు అతిధ్యమిచ్చినందునే.. కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ ను టార్గెటే చేశారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిగ్గదీసి అడుతున్న క్రమంలో ఇది ఖచ్చితంగా కక్షసాధింపు రాజకీయాలే అన్న వాదన తెరపైకి వచ్చినా.. గత నాలుగు రోజులుగా అక్కడ సాగుతున్న అదాయపన్ను అధికారుల తనిఖీల్లో తవ్విన కొద్ది అక్రమాస్తులు బయటపడుతున్నాయి. మంత్రి శివకుమార్ నివాసంతో పాటు అతని బంధు మిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల జరుపుతున్న సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
మరీముఖ్యంగా ఆయన ఆప్తులు, మిత్రులు, వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలోని అక్రమ ధనాన్ని, ఆస్తుల పత్రాలను దాచుకునేందుకు వీలుగా నేలమాలిగలను కూడా నిర్మించారంటే వీరి అక్రమార్జన ఎంతో కూడా సామాన్యులకు ఇట్టే అర్థమైపోతుంది. శివకుమార్ బంధుమిత్రుల ఇళ్లల్లో పదుల సంఖ్యలో లాకర్లు, నేలమాలిగల్లో వందల సంఖ్యల స్థిర, చరాస్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, నగదు బయటపడుతున్నాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు, మైసూరు, హాసన్ తదితర నగరాల్లో దాదాపు 64 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఆయన వ్యాపార పార్ట నర్, అనిల్కుమార్శర్మకు చెందిన ఇంట్లో 16 లాకర్లు, ఒక నేల మళిగ ఉన్న గదిని అధికారులు గుర్తించారు. వాటి నుంచి వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక శివకుమార్ ఆప్తులైన వినయ్ కార్తీక్, ఎమ్మెల్సీ రవి, ద్వారకనాథ్, సచిన్ నారాయణ, బాలాజీ సుభేష్, తిమ్మయ్య తదితర ఇళ్ల నుంచి కిలోలకు కిలోలు బంగారు, వెండి ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ విదేశాల్లో కూడా కొన్ని వ్యాపారాలు కలిగిఉన్నట్లు.. మనీల్యాండరింగ్ కు కూడా పాల్పడినట్లు ఐటీ అధికారులు అనుమానం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more