సంచలనం సృష్టించిన విజయవాడ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యాచారం కేసును పునర్విచారణ సిట్ చేతిలో పెట్టింది ఏపీ ప్రభుత్వం. 8 ఏళ్లు శిక్ష అనుభవించిన సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ యేడాది ఏప్రిల్ 1న హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న సత్యం రోకలి బండతో గోడను ఎలా ఎక్కి దూకాడని చెప్పటం అద్భుతం అంటూ మొట్టికాయలు వేస్తూ అతన్ని రిలీజ్ చేయాలని చెబుతూ పునర్విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
తిరిగి ఆగష్టు 1న ఈ కేసులో కొందరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేసు పురోగతిపై ఆరా తీసింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం జీవో 132ను రిలీజ్ చేసింది. మరోపక్క కేసును సీబీఐకి అప్పగిస్తుందని భావిస్తే సిట్ కు అప్పగించి మరో వాదనకు తెరలేపింది ప్రభుత్వం. సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ నిపుణులతో అధ్యయనం చేయించిన తర్వాతే ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయేషా తల్లిదండ్రులు కనుక అంగీకరిస్తే కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ప్రభుత్వం చివరి నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) (ప్రత్యేక విచారణ బృందం) చేతిలో పెట్టి దుమ్ము దులుపుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కానీ, ఈ విషయం త్వరగతిన తేలాలన్నా, విచారణ వేగవంతం కావాలన్నా సిట్ మాత్రమే కరెక్ట్ అని ఓ మాజీ పోలీస్ ఉద్యోగి చెబుతున్నాడు. ఉన్నత విచారణ కమిటీ సీబీఐతో దర్యాప్తు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. కానీ, సిట్ కు మాత్రం నిర్దిష్ట కాలపరిమితి విధించే అవకాశం ఉంటుంది. తద్వారా కేసు త్వరగతిన పరిష్కారం అవ్వటమే కాదు, మున్ముందు ఆరోపణలు తలెత్తొద్దన్న కారణాలతోనే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించకపోయి ఉండొచ్చని ఆ ఉన్నతాధికారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. విచారణ బృందంలో మహిళా అధికారులు కూడా ఉండాలన్న ఆదేశంతోపాటు, రాష్ట్ర డీజీపీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించిన ప్రభుత్వం తాము అయేషా కేసు విషయంలో ‘చిత్తశుద్ధి’ తోనే ఉన్నామన్న సంకేతాలను పంపింది. ఏది ఏమైనా ఈ కేసులో ఇప్పటికైనా న్యాయం జరిగితే చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more