కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కంటతడి పెట్టారు..? అంటే ఆయనకేం బాధలు వున్నాయో..? అని నిట్టూర్చకండి.. అవి భాదతోనే, అవేదనతోనే, లేక ఇబ్బందులతోనే వచ్చిన కన్నీళ్లు కాదు. తన దత్తత గ్రామం ద్వారం పూడిలోని చిన్నారులు చెబుతున్న వాస్తవాలను విని.. ఆయన కంట ఆనందబాష్పాలు తన్నుకుని వచ్చేశాయి. ఇది ముమ్మాటికీ నిజం. తనకు తీరిక లభించిన వేంటనే తన నియోజకవర్గం పరిధిలోని దత్తత గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు.
ద్వారంపూడి గ్రామంలోని ఎంపీపీ స్కూలు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నరి విద్యార్థులు.. చిట్టి ఉపాధ్యాయులుగా మారిన వైనాన్ని తెలుసుకున్నారు. వారు మరెవరికి విద్యాబోధన చేస్తున్నారని అంటారా..? తమ తల్లిదండ్రులతో పాటు తత్సామానమైన పెద్దలకు అక్షరాభ్యాసం చేస్తున్నారు. వేలిముద్ర వేయడం కూడా రానీ తమ పెద్దలకు ముందుగా వేలిముద్రలు ఎలా వేయాలన్న విషయమై పాఠాలను చెప్పారు. దీంతో గ్రామంలో ఇక వేలిముద్ర వేయడం రానీ వారంటూ ఎవరూ లేరిన చిట్టి ఉపాధ్యాయులు చెప్పిన మాటతో కేంద్రమంత్రి కంట అనందంతో కన్నీరు తొలికింది.
విజయనగరం జిల్లాకు చెందిన తమ గ్రామం ద్వారంపూడి పేరును, చిట్టి గురువుల అంశాన్ని ప్రధాని నరేంద్రమోడీ కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారని ఓ విద్యార్థి చెప్పడంతో కేంద్రమంత్రి అనందబాష్పాలు రాల్చారు. అంతేకాదు గ్రామంలోని విద్యార్థులు ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు వయోజనులకు విద్యాభ్యాసం చేస్తామని కూడా విద్యార్థిని చెప్పడంతో ఆయన కంటతడి పెట్టారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారాయన. గ్రామంలో అన్ని సమస్యలను అంచెలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు కేంద్రమంతి. అంతకుముందు గ్రామంలో ఆయన మొక్కలను నాటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more