పాకిస్థాన్ లో అధికార ప్రభుత్వాన్ని ముప్పుతిప్పల పెట్టి ఎట్టకేలకు న్యాయపోరాటం ద్వారా మూడు చెరువుల నీళ్లు తాగించిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు గట్టి షాక్ తగిలింది. ఏకంగా అధ్యక్షుడు ఇమ్రాన్ పైనే తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ మహిళ పార్లమెంటు సభ్యురాలు పార్టీకి గుడ్ బై చెప్పింది. నవాజ్ షరీప్ ను గద్దెదింపానన్న అనందంలో వున్న ఇమ్రాన్.. రానున్న పాకిస్తాన్సార్వత్రిక ఎన్నికల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన పార్టీకి చెందిన ఎంఎన్ఏ ఆయేషా గులాలై ఇమ్రాన్ ఖాన్ ఆయనకు ఏమాత్రం వ్యక్తిత్వం లేదని అరోపణలు చేస్తూ రాజీనామా చేశారు.
మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అరోపించింది. తనతో పాటు పార్టీలోని ఇతర మహిళా నేతలకు ఇమ్రాన్ ఖాన్ అశ్లీల, అసభ్య సందేశాలు పంపేవారని ఆమె మండిపడ్డారు. ఇమ్రాన్ వల్ల తాను చాలా వత్తిడికి గురయ్యానని తెలిపిన అమె ఏకంగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పింది. పనామాగేట్ వ్యవహారంలో ప్రధాని నవాజ్ షరీష్ పదవికి దూరమైన నేపథ్యంలో ఆ పదవిని అందుకునేందుకు దేశవ్యాప్తంగా భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఆయనపై మహిళా నేత అరోపణలు గుప్పించడం గమనార్హం.
సరిగ్గా, పాక్ నూతన ప్రధానిగా అబ్బాస్సీ ప్రమాణం చేసిన సమయంలోనే ఆమె ఈ విధంగా పీటీఐకు గుడ్ బై చెప్పారు. వ్యక్తిత్వం, గౌరవమర్యాదలే తనకు ముఖ్యమని, ఆ విషయంలో రాజీపడలేకే, రాజీనామాకు సిద్దపడినట్లు అమె స్పష్టం చేశారు. పీటీఐలో మహిళా శ్రేణులకు గౌరవం లేదని.. గౌరవప్రదమైన మహిళలెవరూ పార్టీలో పనిచేయలేరని ఆమె అన్నారు. అయితే, తాను ఈ విధమైన వేధింపులకు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్నానని అమె చెప్పడంతో.. ఈ విషయమై అనుమానాలు కూడా వెల్లువెత్తాయి. కాగాపీటీఐ మహిళా నేత, చీఫ్ విప్ షిరీన్ మజారీ తోసిపుచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయేషాకు టికెట్ నిరాకరించడంతోనే ఆమె ఈ ఆరోపణలు చేశారని, పార్టీలోని మహిళలందరినీ ఇమ్రాన్ ఖాన్ సోదరుడిగా నిలబడతారని అమె అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more