రెండే రెండు రోజుల్లో మొత్తం దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేశాయి బీహార్ పరిణామాలు. కూటమికి హ్యాండిచ్చి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా, వెంటనే బీజేపీతో పొత్తు, ఆపై ఎమ్మెల్యేల మద్ధతుతో మళ్లీ ప్రమాణ స్వీకారం విదితమే. భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీలో గుబులు రేపగా, బీజేపీలో మాత్రం కొత్త ఆశలు చిగురింపజేసింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నట్టు అయింది.
ఇక ఇప్పుడు బీహార్ వాసులు తమ చిరకాల కోరిక నెరవేరుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే ప్రత్యేక హోదా సాధన.. బీహార్కు ప్రత్యేక హోదా కోసం అసరమైతే ఏ కూటమికైనా మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని 2014 ఎన్నికల్లోనే నితీశ్ ప్రకటించాడు. అప్పటికే బీజేపీతో వైరం ఉన్నా.. ప్రత్యేక హోదా ఇస్తామంటే తిరిగి కలుస్తామని పేర్కొని నితీశ్ సంచలన ప్రకటనే చేశాడు. 2015లో బీహార్లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ రూ.1.25 లక్షల కోట్లతో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అయితే అది వర్కవుట్ అవ్వలేదు. అయినప్పటికీ మోదీ వాగ్దానాన్ని గత రెండున్నరేళ్లుగా నితీశ్ గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి బీహార్ అభివృద్ధికి నిధులు చాలా అవసరమని ఆర్థిక మంత్రి జైట్లీని అడుగుతూ వస్తున్నాడు.
అయితే తాజాగా రాజకీయ సమీకరణలు మారి జేడీయూ ఇప్పుడు ఎన్డీఏ పక్షమైంది. 1998 తర్వాత రెండు చోట్ల బీహార్ లో ఒకే ప్రభుత్వం ఉంది. ఈ పరిణామం బీహార్ అభివృద్ధికి దోహదపడుతుందని, కేంద్రం నుంచి నిధుల రాకకు ఇక ఎటువంటి సమస్యలు ఉండవని ప్రజలు గంపెడు ఆశలతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా రాకున్నా ఆ మేరకు నిధులు సంపాదించుకోవడం నితీశ్కు పెద్ద కష్టం కాబోదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more