అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటే అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షలు న్యాయస్థానాలు విధిస్తే.. ఇక వాటికి తిరుగుండదు. కఠిన శిక్షణలు వేసే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా అత్యాచారాలకు న్యాయస్థానాలే శిక్షలు విధిస్తాయి. కానీ ధాయాధి దేశం పాకిస్థాన్ లో మాత్రం చట్టాలు, న్యాయస్థానాలను కాదని కేవలం గ్రామ పంచాయితీలే శిక్షలను విధిస్తాయి. ఆ దారుణ శిక్షలు ఎలా వుంటాయన్న విషయం తెలిస్తే ఎవరైనా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అత్యాచారాలకు అత్యాచారాలే తగిన శిక్షగా ఈ పిర్గాలుగా పిలవబడే ఈ పంచాయితీలు విధిస్తాయి. బాధితురాలికి న్యాయం చేయాల్సిన గ్రామ పంచాయితీలు.. నిందితుడి కుటుంబానికి చెందిన అడపడచులపైన అత్యాచారం చేయించేలా.. తీర్పును చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలికి న్యాయం జరగకపోగా, మరో అడపడచు కూడా గ్రామ పెద్దల సమక్షంలో.. గ్రామస్థులందరూ కళ్లప్పగించుకుని చూస్తుండగా అత్యాచారానికి గురువుతుంది. ఇది కౌరవుల సభలో ద్రౌపతి ఘటనలా నిలుస్తుంది. గ్రామపెద్దల తీర్పుపై నిరసనలు పెల్లుబిక్కినా.. దానిని ఎదురించలేక.. మిన్నకుండిపోతున్నారు.
తాజాగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని ముల్తాన్ పట్టణానికి చేరువలో వున్న రాజ్ పూర్ అనే గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గడ్డి కోసేందుకు వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలికపై ఓ కామపిశాచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం గ్రామ పంచాయితీ పెద్దల దృష్టికి బాధిత కుటుంబసభ్యులు తీసుకురాగా, వారు దారుణమైన తీర్పిచ్చారు. 16 ఏళ్ల నిందితుడి సోదరిపై ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని తీర్మానం చేశారు.
ముహల్లే గ్రామానికి చెందిన యువకుడు రాజ్ పూర్ పంచాయితీని ఆశ్రయించి, తన సోదరిని సదరు గ్రామానికి చెందిన తమ బంధువులైన వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశాడు. పంచాయితీ అధ్యక్షుడు విచారణ జరిపి, రేప్ చేసిన యువకుడి సోదరిని నలుగురి మధ్యకూ రప్పించి, ఆమెపై అత్యాచారం చేయాలని, దాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడాలని తీర్పిచ్చాడు. ఈ తీర్పును వారు వ్యతిరేకించినా, ఇదే సరైన శిక్షని చెబుతూ, తమ తీర్పును దగ్గరుండి అమలు చేయించారు. ఈ ఘటన అక్కడి స్త్రీ సంక్షమ కమిటీ పోలీసుల దృష్టికి తీసుకురాగా, వారు కేసు నమోదు చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more