ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ధేశకులని విశ్వసించి.. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుణ పతాక పార్టీలపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాపపక్షాల హాయంలో విజయవాడ అభివృద్ది జరిగిందన్నది వాస్తవం కాదని, విజయవాడ అసలైన అభివృద్ది తమ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. విజయవాడలోని తూర్పు నియోజకవర్గం సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లెప్ట్ పార్టీలకు చాన్స్ వస్తే తనకు.. తన నాన్న చంద్రబాబుకు మధ్య కూడా గోడవలు సృష్టిస్తారని అన్నారు. ప్రతిపక్షాలు ధర్నాలకు పిలుపునిస్తే ప్రజలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆంద్రులకు తెలుగుదేశం పార్టీ తీసుకువస్తుస్న ప్రజాహిత కార్యక్రామాలు అకర్షిస్తున్నాయి కాబట్టే ప్రతిపక్షాల వైపు కన్నెత్తి చూడటం లేదని అన్నారు. తాము ప్రజలకు జవాబుదారి కానీ ప్రతిపక్షాలకు కదాని లోకేస్ అన్నారు. కాపులకు అన్ని చేస్తున్న చంద్రబాబును ఎందుకు తిడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
కాపులకు మంచి పనులు చేస్తున్న తమను తిట్టిపోస్తూ.. ఏమీ చేయని వాళ్లు విద్వేషాలకు మాత్రం ఆ సామాజికవర్గం వారు లోంగిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాల వారీగా విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారని, అయినా ఎవరైనా వాడితే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more