రద్దయిన నోట్ల ఇక పాతరేయడానికి తప్ప మరెందుకు పనికి రావా..? పాత నోట్ల మార్పిడికి ఇక చీటీ చెల్లినట్లేనా..? మరో అవకాశం ఇక లేనట్లేనా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రంకోర్టు పాత నోట్ల డిపాజిట్ చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించాలని చేసిన సూచనలను కేంద్రం తోసిపుచ్చింది. చట్టబద్దత కానీ ఈ నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఎలాంటి అవకాశం కల్పించమని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పింది. పాత పెద్ద నోట్లు డిఫాజిట్ కు అవకాశం కల్పిస్తే.. నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యకు విఘాతం కల్గుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
గతేడాది నవంబర్ 8న ప్రధానమంత్రి అకస్మాత్తుగా పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారని, ఆ తరువాత ప్రజలకు కరెన్సీ కోసం పడరాని పాట్లు పడ్డారని, ఇక పాత నోట్లును మార్పిడి చేసుకునేందుకు పెద్ద స్థాయిలో బ్యాంకుల వద్ద క్యూలు వుండటంతో.. అనేక మంది పాత పెద్ద నోట్లను మార్పిడి చేసుకోలేదని, వాటిని తమ వద్దే అట్టిపెట్టుకున్నారని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాజ్యం దాఖలైంది. కేంద్ర సల్పకాలిక గడువులో.. మొత్తం దేశం ప్రజలను కష్టపెట్టిందని పిటీషన్ లో పేర్కోన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది.
సరైన కారణం చెప్పిన వారికి చివరి అవకాశాన్ని కల్పించాలని సూచించిన సుప్రీం.. కేంద్రం నల్లధన నిర్మూలణ చర్యల్లో భాగంగా నిజాయితీ పరులు ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా చెప్పింది. అయితే గతంలో పొడిగించిన గడువులు, పెట్రోల్ బంకులు, రైల్వే టిక్కెట్ల బుకింగ్స్లో పాత నోట్లకు అనుమతి ఇవ్వడం వంటి వాటిలోనే చాలా దుర్వినియోగాలు తలెత్తాయని, మరోసారి కొత్తగా అవకాశం కల్పిస్తే బినామి లావాదేవీలు పెరిగే అవకాశముందని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. బోగస్ కేసుల నుంచి సహేతుకమైన వాటిని గుర్తించడం కూడా కష్టతరమని కేంద్రం పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more