Siddaramaiah attacks BJP alleges dalit love is only upto elections ‘‘బీజేపి దళిత ప్రేమ భూటకం.. ధమ్ముంటే ఇలా చేయండి..’’

Siddaramaiah attacks bjp for fomenting communal divide in coastal karnataka

siddaramaiah, BJP, Dalits, relationship, Mangaluru, Congress, communal divide, dalit love for elections, sangh parivar, Karnataka, politics

karnataka CM siddaramaiah critises BJP love for dalits is just in words, not in action. If really bjp loves dalits why not bjp upper caste leaders turn that in to relationship by giving their daughters and sons to them, he questions.

‘‘బీజేపి దళిత ప్రేమ భూటకం.. ధమ్ముంటే ఇలా చేయండి..’’

Posted: 07/08/2017 02:35 PM IST
Siddaramaiah attacks bjp for fomenting communal divide in coastal karnataka

‘‘బీజేపి దళిత ప్రేమ భూటకం.. ధమ్ముంటే ఇలా చేయండి..’’ అని ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు ఆ ముఖ్యమంత్రి. ఎవరాయన అంటారా.. అయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే బీజేపి నేతలకు దళితులపై ప్రేమ పుట్టుకొస్తుందని, ఆ తరువాత వారిని పట్టించుకున్న పాపన కూడా పోరని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు దళితులపై నిజమైన ప్రేమ ఉంటే తాను చెప్పినట్లు చేయాలని సవాల్ చేశారు.

బీజేపి అగ్రవర్ణాల నేతలు తమ ఇంటి అడపడచులను దళిత యువకులకు ఇచ్చి వివాహాలు చేయాలని, తమ ఇంటికి వచ్చే కోడళ్లను కూడా దళిత వర్గాలకు చెందిన వారినే తెచ్చుకోవాలని సిద్ధరామయ్య సవాల్ విసిరారు. దీంతో నిజంగా బీజేపి దళితులపై ప్రేమ వుందని భావిస్తామన్నారు. సమాజంలో కూడా పెనుమార్పులకు ఇది దారితీసి.. కులవ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తుందని అన్నారు. వీటికి బదులు బీజేపి నేతలు కేవలం ఎన్నికల ముందు దళితుల నివాసాల్లో బోజనాల పేరుతో భూటక ప్రేమను ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

ఓ వైపు దళితులు బోజనాలపై కత్తినూరుతూనే.. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారన్న అరోపణలతో మరోవైపు వారిపై గోరక్ష కమిటీల పేరుతో దాడుతూ చేస్తూనే వున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మాత్రమే హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని దళితుల ఇళ్లల్లో తింటూ, వారిపై ప్రేమ ఉన్నట్టుగా బీజేపీ నాయకులు నటించడం సబబుకాదని అన్నారు. ఓట్ల కోసమే బీజేపీ నేతలు వేస్తున్న వేషాలను దళితులు కూడా గమనిస్తున్నారని ఆయన విమర్శించారు. పనిలో పనిగా ఆయన రాష్ట్ర బీజేపి నేతలను కూడా టార్గెట్ చేశారు.

కర్ణాటకలో ఒకే ఒక్కసారి బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. అయితే అదే అధికారం చేతిలో వుందని ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో కూడా కన్నడీగులకు తెలుసునని ఆయన దుయ్యబట్టారు. కర్ణాటకలో బీజేపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. అవినీతి అక్రమాలకు పాల్పడి చివరకు జైలుకు కూడా వెళ్లారని.. ఈ విషయం కూడా ఓట్లు వేసే సమయంలో ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. అవినీతికి, అక్రమాలకు దూరంగా కేవలం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజల అశీస్సులు నిత్యం వుంటాయని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siddaramaiah  BJP  Dalits  relationship  Mangaluru  Congress  communal divide  Karnataka  politics  

Other Articles