ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సాయం అందించటంలో ప్రపంచ బ్యాంకు ట్విస్ట్ ఇచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారన్న రైతుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది.
ప్రపంచ బ్యాంకు ప్యానెల్ చైర్మన్ గోంజాలో కాస్ట్రో డె లా మటా తరపున ఓ నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 8, 2016 న ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి మొదటి ఫిర్యాదు అందింది, కానీ అప్పటికే ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉండటంతో దానిని పక్కన పెట్టేసింది. తిరిగి మే 22, 2017న 22 ఎటాచ్ మెంట్లతో కూడిన మరో నివేదిక వరల్డ్ బ్యాంకు ప్యానెల్ కు అందింది. ఈసారి మీడియా కథనాలతోపాటు కోర్టు ఉత్తర్వులు కూడా దానికి జత చేశారు. మళ్లీ మే 27న రైతుల నుంచి మరో విజ్నప్తి అందింది.
తమ నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, బ్యాంకు ప్రమాణాలను కూడా ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుందని రైతులు అందులో ఆరోపించారు. అంతేకాదు పర్యావరణానికి హానికారకంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో నిధుల మంజూరును తాత్కాలికంగా నిలిపేస్తూ.. జూలై 13 లోపు తమ కమిటీని రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం 1,27, 505 మంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, కేవలం 150 మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక హంగులతో 217 చ.కిమీ అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ల సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఐబీఆర్డీ (ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్ స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్) ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇచ్చే నివేదిక కీలకం కావటంతో ప్రభుత్వం ఆచీ తూచీ వ్యవహారించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 5న జరిగే ప్రపంచబ్యాంకు కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో అమరావతి రుణం మంజూరుపై తుది నిర్ణయం తీసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more