వైఎస్పార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు దేశ సర్వోన్నత న్యాయస్థాం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి అమెను అకారణంగా సస్పెండ్ చేశారన్న విషయమై అమె దాఖలు చేసిన పిటీషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసు వ్యవహారం హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టులోనే ఈ కేసు అంశాన్ని తేల్చుకోవాలని రోజా తరఫు న్యాయవాదులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
అయితే పేదల రక్తమాంసాలను వడ్డీ రూపంలో పిండి పిప్పి చేస్తున్న అంశం కాల్ మనీ.. కాల్ మనీలో పేదింటి మహిళలను డబ్బును రుణంగా ఇచ్చిన పెద్దలు వారి కామవాంఛ తీర్చుకునేందుకు కూడా పూనుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా బాధితులే తాము కాల్ మనీ కేసులో ఎలా ఇబ్బందులకు గురైయ్యమన్న విషయాలను నేరుగా మీడియా ఎదుటే అమ అవేదనను చెప్పుకున్నారు. దీంతో ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని వైసీపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో అధికార టీడీపీ అడ్డుకుంది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
అయితే ఈ వాయిదా సమయంలో ప్రభుత్వ అధినేత చంద్రబాబును కాల్ మనీ చంద్రబాబు అని, సీఎం అంటే కాల్ మనీ అని రోజా అన్నారని అధికారపక్షం అమెను 2015 డిసెంబర్ లో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ అంశమై రోజా ఇప్పటికే క్షమాపణ చెప్పారని, లేఖ కూడా స్పీకర్ కోడల శివప్రసాద్ కు పంపామని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లేఖ అందలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి చెప్పారు. దీంతో ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా? అని రోజా న్యాయవాదులను సుప్రీంకోర్టు అడగగా.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి న్యాయస్థానం సమక్షంలోనే లేఖ అందజేశారు. ఈ లేఖను సంబధిత శాఖలు, అధికారులకు పంపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో కేసు ముగిసిన తర్వాత మాత్రమే తాము విచారణకు స్వీకరిస్తామని మరోసారి స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more