కఠిన చట్టాలతో అయినా మార్పు వస్తుందని భావించినప్పటికీ మానవ మృగాలు అంతకంతకు రెచ్చిపోతున్నాయి. భద్రత పటిష్టంగా ఉండాల్సిన దేశ రాజధానియే మహిళలపై అఘాయిత్యాలకు వేదికగా మారుతోంది. 48 గంటల్లోనే 5 రేప్ కేసులు నమోదవ్వటం శోచనీయం. గురుగావ్ లో వీధుల్లోనే నిర్భయంగా జరిగిన మరో ఘోర ఘటన కలకలం రేపుతోంది.
రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన ఓ మహిళ (35) భర్త నుంచి విడిపోయి వంట పని చేస్తూ తన ముగ్గురు పిల్లలతో జీవిస్తోంది. గురుగావ్ లో ఉన్న తన కుటుంబ సభ్యులను చూసేందుకు 15 రోజుల క్రితం వచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భోజనం చేశాక ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుంది. ఇంతలో దూసుకొచ్చిన ఓ స్విప్ట్ కారు, అందులోని ముగ్గురు దుండగులు ఆమెను కారులోకి లాగేశారు. వీధుల గుండా కారును తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
అలా 8 గంటలపాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. అనంతరం ఉదయం నాలుగు గంటల సమయంలో ఓ దాబా దగ్గర ఆమెను పడేసి పారిపోయారు. ఓ ఆటోడ్రైవర్ సాయంతో ఆస్పత్రికి చేరిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని, రిపోర్టుల వచ్చాకే ఆమె అత్యాచారయత్నం గురించి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.
అయితే ఆమె చెబుతున్న కథనం, ఆస్పత్రిలో చేరిన విధానంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనంతట తానుగానే ఆమె కారులో ఉంటుందని భావిస్తున్నారు. సీసీ పుటేజ్ తోపాటు, ఆటోడ్రైవర్ ను విచారించి అసలు విషయం రాబట్టేందుకు యత్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more