ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. తన నగ్న ఫోటోపై కామెంట్ చేయటం పై ఓ గిరిజన మహిళ కోర్టును ఆశ్రయించింది. యోగితోపాటు అస్సాం లోక్ సభ ఎంపీ రాం ప్రసాద్ శర్మ పై కూడా ఆమె ఫిర్యాదు చేసింది.
పదేళ్ల క్రితం క్రితం 24 నవంబర్ 2007న ఆల్ ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ అస్సాం ఆందోళన సందర్భంగా కొందరు లక్ష్మీ ఓరంగ్ అనే మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. జూన్ 13న అసోం లోక్ సభ సభ్యుడు రాం ప్రసాద్ సర్మాలు...తనను వివస్త్రను చేసి వారు కొడుతున్న చిత్రాన్ని ఎలాంటి పోస్ట్ చేశాడు. దానికి యోగి ఆమె బీజేపీ కార్యకర్త అని, దాడి చేసింది కాంగ్రెస్ అంటూ కామెంట్ పెట్టాడు.
దీంతో సదరు మహిళను నగ్న చిత్రాన్ని ఎలాంటి మార్పులు లేకుండా షేర్ చేయటమే కాదు, తన పరువును తీసేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎలాంటి ఫిల్టర్ వేయకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారని, పైగా తాను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు కనుక తప్పుడు ప్రచారం చేశారంటూ ఆరోపించింది. ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బిస్వనాథ్ లోని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది.
వాంగ్మూలం నమోదు చేసిన మెజిస్ట్రేట్ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేశారు.బేటీ బచావో.. బేటీ పడావో అనే ప్రధాని హయాంలో ఇలాంటి నేతలు కూడా ఉన్నారంటూ ఆమె మండిపడింది. దీనిపై శర్మ స్పందిస్తూ బాధితురాలికి న్యాయం జరగాలనే షేర్ చేశాను తప్ప మరెయితర ఉద్దేశం లేదని తెలిపాడు. ఈ మధ్య ఆమె కేసును రీ ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్ ను కోరిందే ఆయన. అలాంటి తనపైనే ఆమె కేసు వేయటంతో న్యాయపరంగానే ఎదుర్కుంటున్నానని శర్మ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more