భారత దేశ ప్రజల ధనాన్ని అప్పనంగా దోచుకుని విదేశాలకు వెళ్లి మళ్లీ అదే విలాసాలు, రాజభోగాలను అనుభవిస్తూ.. ఏకంగా టీమిండియా పాకిస్థాన్ మ్యాచ్ కు వచ్చి మరీ వీక్షించిన మాల్యా.. తాను మళ్లీ మళ్లీ మ్యాచ్ చూడటానికి వస్తాను అని.. విర్రవీగిన విషయం తెలిసిందే. అలాంటి మాల్యా మొన్న సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోకి వెళ్తున్న మాల్యాను దోంగ, దోంగ అంటూ భారత యువత అరవడంతో..షాక్ కు గురైన అర్థిక నేరస్థుడు చడీ చప్పుడు లేకుండా స్టేడియంలోకి జారుకున్నాడు.
దీంతో చిర్రెత్తుకోచ్చిన మాల్యా.. తనపై ఇంతటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ ఏకంగా మీడియాను అడిపోసుకున్నాడు. తనను దోంగ అన్న యువకులను ఎదరించలేక.. కేవలం ఇద్దరు తాగుబోతులు మాత్రమే అరిచారని మిగతా వారు తనకు విషెస్ చెప్పారని అన్నారు. లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో భారత్ కు మాల్యాను అప్పగించాలన్న వాజ్యంపై విచారణ సందర్భంగా.. తాను భారతీయ బ్యాంకులకు ఏమీ బాకీ లేనని చెప్పాడు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు ఇలాంటి అబద్దాలతో న్యాయస్థానం నుంచి ఆరుమాసాల పాటు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు.
ఇలా లండన్ కోర్టులో స్వల్ప ఊరట లభించిన మాల్యాకు ఈడీ షాక్ ఇచ్చింది. ముంబై పీఎంఎల్ఏ కోర్టులో బుధవారం మొట్టమొదటి చార్జ్షీట్ఫైల్ చేసింది. ఉద్దేశ పూర్వక భారీ రుణ ఎగవేత దారుడిగా తేలిన మాల్యాపై ఎట్టకేలకు అధికారంగా ఐడీబీఐ రూ.900 కోట్ల కేసులో చార్జ్షీటను నమోదు చేసింది. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించడం అంత ఈజీ పని కాదని అక్కడి న్యాయస్థానం అనుమతి తీసుకన్న తరువాత అతడ్ని తీసుకువస్తామని కేంద్రమంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ఈడీ చార్జిషీటు దాఖలు చేయడంపై భారతీయులు హర్షం వ్యక్తం చే్స్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more