మధ్యప్రదేశ్లోని బాణాసంచా కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారిలో ఇంకా పలువురి పరిస్థితి విషమంగానే వుందని వైద్యవర్గాలు తెలిపాయి. బాలాఘాట్ జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో క్రితం రోజు సాయంత్రం పెద్ద విస్పోటనంతో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కార్మగారంలో పనిచేస్తున్న కార్మకులు మరీ ముఖ్యంగా దినసరి కూలీలు తమ ప్రాణాలను కొల్పోయారు.
ఈ దుర్ఘటన జరుగగానే 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను బాలాఘాట్ లోని జిల్లా అస్పత్రితో పాటు పక్కనున్న చత్తీస్ గడ్ రాష్ట్రంలోని భిల్లాయ్ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్స పోందుతున్న కార్మికులలో కూడా కొందరు అసువులు బాయడంతో మృతుల సంఖ్య 23కు చేరుకుంది. ప్రమాదం కారణంగా బాణసంచా కర్మాగారంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయని స్థానికులు పేర్కొన్నారు.
ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. వహీద్ అహ్మద్ వార్సీకి చెందిన ఈ పరిశ్రమ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఖైరీ గ్రామంలో నెలకొనడంతో.. క్షతగాత్రులను వెంటనే అస్పత్రికి తరలించడం లో జాప్యం ఏర్పడిందని కార్మిక సంఘాలు అరోపిస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక మరే కారణం వల్లయినా జరిగిందా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more