అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేషకుల అగ్రహానికి మరో తెలుగు యువకుడు జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడి నల్లజాతీయులకు తెలుగు యువకుడి మధ్య ఏదో చిన్న విషయమై రేగిన వివాదం విషాధాన్ని నింపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. అదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా, తమ అబ్బాయి విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడి తండ్రి మంత్రి హరీష్ రావును అభ్యర్థిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు అప్పగించాలని ఇప్పటికే భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మస్వరాజ్ సంబంధింత అధికారులను అదేశించారు.
వివరాల్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి ఎంఎస్ పూర్తి చేయాలన్న అశతో వెళ్లిన సంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు ముబీన్ అహ్మద్.. 2015లో కాలిఫోర్నియాకు చెందిన ఓ యూనివర్శిటీలో చేరాడు. గత రెండు మాసాల క్రితం ఆయన తన ఎంఎస్ పూర్తి చేసుకున్నాడు. దీంతో అక్కడే తనకు ఉపాధి కోసం అన్వేషిస్తున్న ముబీన్.. ఖాళీగా వుండటం ఇష్టం లేక కాలిఫోర్నియాలోని ఓ ప్రైవేటు స్టోర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అదివారం సాయంత్రం కొందరు నల్లజాతీయులు వచ్చి తమకు కావాల్సిన సరుకులను తీసుకున్నారు.
అయితే బిల్లు చెల్లింపుల విషయంలో ముబీన్ కి నల్లజాతీయులకు మధ్య మాటమాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తులైన నల్లజాతీయులు వెంటనే తమ జేబులోంచి తుపాకీని తీసి ముబీన్ పై కాల్పలు జరిపారు. తూట నేరుగా ముబీన్ కడుపులోకి దూసుకెళ్లి.. లీవర్ కు డ్యామేజ్ చేసింది. రక్తపు మడుగులో పడివున్న ముబీన్ కాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్ అస్పత్రికి తరలించిన స్టోరు యాజమాన్యం అక్కడ అయనకు సర్జీరీ చేయించింది. అయినా అతని పరిస్థితి ఇంకా విషమంగానే వుందని వైద్యులు చెప్పారు.
అమెరికాలోని చికాగోలో వుంటున్న ముబీన్ బంధువులు అస్పత్రికి చేరుకుని అతని పరిస్థితిపై వైద్యులను వాకాబు చేస్తూ.. ఇటు సంగారెడ్డిలోని అతని తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ మిలటరీ క్యాంటీన్ లో విధులు నిర్వహిస్తున్న ముబీన్ తండ్రి ముజీబ్ అమ్మద్.. తెలంగాణ మంత్రి కె.హరీష్ రావును కలుసుకుని వెంటనే తెలంగాణ ప్రభుత్వం తమ బిడ్డను అదుకోవాలని విన్నవించారు. ఇదిలావుండగా, ఈ ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అమెరికాలోని భారత రాయభార కార్యాలయ అధికారులను అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more