మయన్మార్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సుమారు 120 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ సైనిక విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. అండమాన్ సముద్రంలో అది కుప్పకూలిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 105 మంది ప్రయాణికులు, మరో 11 మంది సిబ్బందితో మయన్మార్ కు చెందిన వై-8ఎఫ్-200 విమానం బయలుదేరింది.
బుధవారం దక్షిణ ప్రాంత నగరమైన మయిక్, యాంగూన్ మధ్య విమానం గల్లంతైనట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. మధ్యాహ్నం 1.35 నిమిషాలకు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. 20 మైళ్ల దూరం వెళ్లిన తర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా కట్ అయ్యాయి. గాలింపు చర్యల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. దవాయ్ పట్టణానికి 218 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో శకలాలను గుర్తించారు.
నాలుగు నౌకాదళ నౌకలు, రెండు ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు ఈ గాలింపు చేపట్టగా, లుంగ్లాన్ ప్రాంతంలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి, మహిళ, చిన్నారి మృతదేహంతో పాటు లగేజీ బ్యాగ్ లు, సేఫ్టీ జాకెట్లు, విమానం టైరు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. ఈ ఉదయం 8:25 గంటల ప్రాంతంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్టు మయన్మార్ సైనిక ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. దీంతో ప్రయాణికులంతా జలసమాధి అయినట్టు భావిస్తున్నామని, ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని వారు చెబుతున్నారు.
కాగా, ప్రయాణికుల్లో 90 మంది ఆర్మీ కుటుంబాలకు చెందినవారని, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో 15 మంది చిన్నారులు, 35 మంది సైనికులు, 14 మంది విమానం సిబ్బంది కాగా, మిగిలిన వారు సైనికుల కుటుంబీకులని ఆర్మీ చీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చిన్నారుల్లో అత్యధికులు యాంగాన్ లో వైద్య పరీక్షలకు వెళుతున్నారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more