ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. దేశ రాజధానికి సమీపంలోని నోయిడాలో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు దారుణహత్యకు గురైంది. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నివసిస్తున్న అపార్డుమెంటులోనే ఓ ఓ దుండగుడు అమె వెంటపడి మరీ కాల్చి చంపాడు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా యమునా విహార్కు చెందిన యువతి అంజలీ రాథోడ్ (23) ఇటీవలే నోయిడాలోని లావా మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.
అదే ప్రాంతంలో ఆరుగురు యువతులతో కలిసి శతాబ్ది విహార్ లోని ఓ అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తుంది. ఓ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఆమె తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సెల్లార్ లోకి వచ్చింది. అదే సమయంలో మొహానికి ముసుగు ధరించి వచ్చిన ఓ ఆగంతకుడు తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఆ యువతిని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారు. ఆ యువతికి తన బాయ్ఫ్రెండ్ నుంచి ఫోన్ రావడంతో సెల్లార్ కు వెళ్లిందని, అదే సమయంలో ఈ హత్య జరిగిందని ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు.
అయితే అమెను హత్య చేసింది ఎవరు అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అమె ప్రేమలో పడటం ఇష్టంలేని వారు అమెను చంపించారా..? లేక ఆ యువతిని వన్ సైడ్ లైవ్ చేస్తున్న వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టారా..? అన్న కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక తన బాయ్ ఫ్రెండే ఈ హత్యకు కారణమా..? అన్న యాంగిల్ లోనూ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక అంజలీని చంపిన యువకుడు సుపారీ తీసుకుని వచ్చి అమెను చంపాడా..? లేక అమె భాయ్ ప్రెండ్ స్నేహితుడా..? అన్న అనుమానాలు కూడా పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more