ప్రియుడితో శృంగారం కోసం టీవీ నటి ఏం చేసిందో తెలుసా..? ఏకంగా తన భర్తతో పాటు తన ఇద్దరు పిల్లల కళ్లు గప్పి రహస్యంగా జల్సా తిరుగుళ్లు తిరిగిన బుల్లితెర నటి.. భర్తను కడతేర్చి పరలోకాలకు పంపింది. అయితే తన భర్తను ఎవరో అగంతకులు వచ్చి దారుణంగా కొట్టి హతమార్చారని కపట నాటకాన్ని అడింది. టీవీ సీరియళ్లకు ఏమాత్రం తీసిపోని కథను పక్కా ప్రణాళికతో రచించింది. అయితే పోలీసుల మార్కు విచారణతో నిజం తన్నుకుని భయటకు వచ్చింది. దీంతో నటితో పాటు అమె ప్రియుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దలు అనాలోచితంగా చేసిన తప్పులకు పిల్లలు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఈ ఘటన రుజువుచేస్తుంది. తండ్రి మరణించగా, తల్లి జైలు పాలు కావడంతో అమె ఇద్దరి పిల్లలు అనాధయ్యారు.
యశ్వంతపుర పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న తుమకూరు నగరానికి చెందిన సతీష్ (36)తో కల్పనకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఎప్పడు కలల ప్రపంచలో విహరించే కల్పన.. టీవీ సీరియళ్లలో నటిస్తానని భర్తను అడిగింది. అయితే తొలుత ససేమిరా అన్న భర్త.. చివరకు అమె పోరు పడలేక ఎట్టకేలకు సరేనని అంగీకరించాడు. దీంతో బుల్లితెరపై నటనతో ప్రజలు అమెను గుర్తుపట్టే స్థాయిని తెచచుకుంది కల్పన. అయితే అక్కడ అమెకు జావెద్ అనే 27 సహచరుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
విషయం అనోటా, ఈ నోటా తెలుసుకున్న సతీష్ అమెను తన పరిధిలో వుండాలని హెచ్చరించాడు. అవసరమైతే నటనకు కూడా గుడ్ బై చెప్పాలని సూచించాడు. తమ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలని చెప్పాడు. ఇలా అప్పుడప్పుడు చేసే హెచ్చరికలు కాస్తా.. క్రమంగా నిత్యంగా మారాయి. దీంతో తన అక్రమసంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన కల్పన తన ప్రియుడితో కలసి అతడ్ని చంపాలనుకుంది. పథకం వేసింది. ఇక అమలు చేయడానికి కూడా సిద్దమైంది.
ఈ నెల 25వ తేదిన రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. బోజనం చేసిన వెంటనే సతీష్ మత్తులోకి జారుకున్నాడు. దీంతో ప్రియుడు జావెద్ ను యశ్వంతపురలోని సుబేదార్ పాళ్యలో గత తమ నివాసానికి రమ్మని పిలిచింది. అంతే అక్కడకు రాగానే సుత్తితో అతని తలపై ఇద్దరు బాగా మోదీ హత్య చేశారు. ప్రియుడ్ని ఇంటి నుంచి పంపిన తరువాత తన భర్తను ఎవరో వచ్చి హత్య చేశారని నాటకానికి తెరలేపింది. కల్పన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ జరుపగా, అసలు విషయం బయటపెట్టింది. దీంతో అమెతో పాటు ప్రియుడు జావెద్ ను కూడా అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more