కేంద్ర ప్రభుత్వం గోవధకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఇవాళ నాలుగు వారాల స్టే విధించింది. పశువధను అరికట్టేలా దేశ వ్యాప్తంగా ఓ చట్టం తీసుకురావాలని పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా పలువురు అందోళన చేపట్టారు. పశువధ జాబితా నుంచి గేదలను తొలగించాలని డిమాండ్ ముఖ్యంగా తెరమీదకు వచ్చింది. ఇక ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి.
కేరళ, పశ్చిమ బెంగాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ప్రజాందోళన నేపథ్యంలో ఎస్. సెల్వగోమతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా పశువధపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అదేశించింది. ఒక మతం లేదా వర్గం ఆచారాల ప్రకారం జంతువులను చంపడం నేరం కాదని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (పీసీఏ) చట్టంలోని సెక్షన్ 28 చెబుతోందని సెల్వగోమతి తన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు.
అయితే, కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై స్టే విధించిన న్యాయస్థానం.. తదుపరి విచారణలోపు తమ ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అదేశించింది.ఈ నేపథ్యంలో అకస్మికంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం, అందులో పలు అంక్షలను విధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నించింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాల తరువాత చేపట్టనున్నట్లు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more