జూన్ లో మరో సంచలనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిధ్దమవుతోంది. చరిత్రలో నిలిచిపోయే భారీ ప్రయోగానికి సిద్ధమైపోతుంది. అతిపెద్ద బరువు కలిగిన స్వదేశీ రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఎంత బరువు అంటే... సుమారు 200 ఏనుగులకు సమానం.
జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) మార్క్-3గా జూన్ మొదటి వారంలో శ్రీహరికోట నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేయనుంది. 4 టన్నుల బరువుండే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూ అనువర్తిత కక్ష్య (జీటీవో) లోకి ప్రవేశ పెట్టేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యంలో గణనీయమైన వాటాను ఒడిసిపట్టేందుకు ఇస్రోకు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. అందుకే భారీ రాకెట్ కు ఫ్యాట్ బోయ్ అని నామకరణం చేసిన ఇస్రో పరీక్షను విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే భారీ రాకెట్ ప్రయోగం కనీసం ఆరు సార్లు విజయవంతమైతే... ఆ తరువాత దీని ద్వారా వ్యోమగామిని భారత్ రోదసీలోకి పంపే అవకాశం కలుగుతుంది. ఇంతకు ముందు ఈ లిస్ట్ లో రష్యా, అమెరికా, చైనా లుఉండగా, ఆయా దేశాలు రాకెట్ లో వ్యోమగామిని కూడా పంపాయి. ఇప్పుడు భారత్ ఆ ఫీట్ ను సాధిస్తే ఆ జాబితాలో చేరి మరో చరిత్రను భారత్ నెలకొల్పుతుంది. కానీ, గతంలో తొలి ప్రయోగాల్లో ఇస్రో విఫలమైంది. అనంతరం వైఫల్యాలను విజయాలుగా మార్చుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగం మాత్రం తొలిసారే విజయవంతం చేయాలని భావిస్తోంది.
ఈ భారీ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయితే... అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో సునాయాసంగా కక్ష్యలో ప్రవేశపెట్టి మరిన్ని విజయాలు అందుకుంటుంది. ఇప్పటికే క్రయోజెనిక్ ఇంజిన్ రాకెట్ ప్రయోగాల కోసం ప్రపంచ దేశాల నుంచి ఇస్రోకు ఆర్డర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more