సక్రమంగా అర్జిస్తే ఎంత కాలానికైనా కాస్తా కూస్తో కూడబెట్టవచ్చునేమో కానీ.. కోట్ల రూపాయాలను మాత్రం అర్జించలేమని తెలుసుకున్న ఓ మహిళ అక్రమాలకు నాంది పలికింది. అక్రమాలలో ఇంధ్రాణి ముఖర్జీ కన్నా తక్కవే అయినా.. మోసాలు చేయడంలో మాత్రం అమె కన్నా అధికమందినే ముంచానని గర్వపడింది. ఎంత ఎగసినా కెరటం కిందపడక తప్పదని తెలయదు కాబోలు అందుకనే ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతుంది. అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులను మోసం చేసిన కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన వంచకి ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. తమకు మంచి వ్యాపారం వుందని అందులో పెట్టుబడులు పెడితే ఏకంగా 30 శాతం మేర లాభాలు వస్తాయని నమ్మబలికింది, అందులో సుమారు 15 శాతం మేర లాభఆలను మీకు ఇస్తామని, మరీ కావాలంటే 20 శాతమైనా ఇచ్చేస్తామని నమ్మబలికింది. ఇలా ఒకరకి ఒక విధంగా మరోకరికి మరో విధంగా మాయమాటలను చెప్పి నమ్మించింది. అమాయకులకు వేసిన ఏకం ఫలించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూపాయలు 20 కోట్ల వరకు వసూలు చేసింది. ఇస్తామన్న సయమానికి అసలు లేక వడ్డీ రాక బాధితులు అమెపై పోలీసులకు పిర్యాదు చేశారు.
మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మౌలాలి ఎమ్.జె.కాలనీలో ఉండే అరుణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు మరో విషయం తెలిసింది. కేవలం అధిక వడ్డీ మాత్రమే కాదు బ్యాక్ డోర్ ద్వారా ప్రముఖ కంపెనీలలో ఉద్యాగాలు ఇప్పిస్తామని, మరికోందరికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలనే ఇప్పిస్తామని నమ్మబలికి వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. ఇక ఇంకోందరి తమకు తెలిసిన వాళ్లు విదేశఆల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని, వారి నుంచి బంగారాన్ని సగం ధరకే ఇప్పిస్తామని కూడా నమ్మబలికి అక్రమంగా డబ్బును వసూలు చేసి శఠగోపం పెట్టింది.
ఇలా అరుణారెడ్డి బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. తమ డబ్బును తమకు చెల్లిస్తే చాలునని కూడా బాధితులు అమెకు మొరపెట్టుకున్నారు. అయినా అమె వినిపించుకోలేదు. ఇక బాధితుల ఒత్తిడి పెరుగుతుండడంలో ముఖం చాటేసింది. అమెపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసు నమోదు కాగా, దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసిందని పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా అమెను ఇటీవల ఒకకేసులో నల్గొండ పోలీసులు అరెస్టు చేశారని తెలసుకున్న మల్కాజ్ గిరి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి అమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more