ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారో లేదో, అమరావతి సచివాలయం బోసిపోయింది. లోకేష్ తో సహా ఎవరూ ఇటువైపు కూడా చూడటంలేదు. అమాత్యులే రాకుంటే మనమెందుకనుకున్నారో ఏమో? ముఖ్య కార్యదర్శుల నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అత్యధికులు సెక్రటేరియట్ కు రాకపోవడంతో ఆఫీసు గదులన్నీ బోసిపోయినట్టు కనిపించాయి.
సీఎం చంద్రబాబునాయుడు అటు బయలుదేరగానే కనీసం ఎయిర్ పోర్ట్ కి కూడా వెళ్లని అధికారులు కాసేపటికే ఒక్కొక్కరూ సచివాలయాన్ని వీడగా, ఇప్పుడు పూర్తిగా కళతప్పింది. కనీసం గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఉన్న మంత్రులు కూడా సచివాలయం వైపు తొంగి చూడలేదు. వాస్తవానికి శని, ఆదివారాలను సచివాలయంలో సెలవుగా పరిగణిస్తుండగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధికారులు తమ స్వస్థలాలకు పయనమవుతుంటారు. దీన్ని గమనించే ప్రజా విజ్ఞప్తుల రోజును గురువారానికి మార్చినప్పటికీ, ఒక రోజు ముందు నుంచే అంటే బుధవారం నుంచే ఆ సీన్ దర్శనమివ్వటం విశేషం.
మరోవైపు నారాయణ తనయుడు నిషిత్ మరణం అనంతరం మంత్రులు, అధికారులు అంతా హైదరాబాద్ కు క్యూ కట్టడం, ఆపై సీన్ నెల్లూరుకు షిఫ్ట్ కావటంతో సచివాలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పాలనపరంగా ఇబ్బందులు తలెత్తటమే కాదు, సచివాలయంలో మంత్రులు ఉంటారని, అధికారులు ఉంటారని తమ గొడును వెళ్లబోసుకుందామని వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలు, వెలవెల బోయే సచివాలయం కన్పిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు అది శృతి మించి పోవటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.
తెలంగాణ ఉద్యోగుల రిలీవ్...
ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం తెలంగాణ స్థానికత కలిగిన 53 మంది ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. అనంతరం వారు వెలగపూడి నుంచి హైదరాబాద్కు బస్సులో బయలుదేరారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సహకరించిన ఏపీ శాసనసభాధిపతి కోడెల శివప్రసాదరావుకు ఈ సందర్భంగా ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ శాసనసభ నుంచి రిలీవ్ అయిన వారిలో పదిమంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీ కాగా, మిగిలిన వారు నాలుగో తరగతి ఉద్యోగులు. ఏపీ శాసనసభ నుంచి మరో 37 మంది ఇంకా రిలీవ్ కావాల్సి ఉందని వారు తెలిపారు. ఇక తెలంగాణకు పయనమైన ఉద్యోగులకు ఏపీ అసెంబ్లీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతికి చిహ్నమైన బుద్ధుడి బొమ్మను కానుకగా అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more