మద్యం మత్తు ఎంతటి మంచివారినైనా దానిని సేవించగానే చెడ్డవారిగా మలిచేస్తుంది. ఈ మధ్యకాలంలొ మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలను నడపకపోవడమే మంచిదన్న సూచనలు కూడా అధికంగా వినబడుతున్నాయి. తాగితే మర్చిపోగలము.. తాగనివ్వరూ.. అంటూ ఏదో విషయంలో మదనపడి అ వ్యధ నుంచి బయట పడేందుకు మద్యం సేవించిన ఇద్దరు యువతులు తమ ప్రతాపాన్ని ఓ అమాయక ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చూపారు. రెడ్ సిగ్నల్ పడినా అగని వారిని వెంబడించి.. పోనిలే యువతులని ఊరుకుని వెళ్లిపోతున్న కానిస్టుబుల్ పై విరుచుకుపడిన యువతులు అతని పోలీస్ యూనిఫాం ను చించేసి.. రచ్చరంబోలా చేశారు. చివరకు తన కోపమె తన శత్రువు అని తెలుసుకున్నారు. కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోవడంతో కటకటాల వెనక్కి చేరుకున్నారు.
చంఢీగడ్ లో ఇద్దరు యువతులు పీకల వరకు మద్యం సేవించి, ఆ మత్తులో ట్రాఫిక్ సిగ్నళ్లను జంప్ చేసి వెళుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్న 29 ఏళ్ల యువతి స్వయంగా పోలీసు సిగ్నల్ ఇచ్చినా ఆగకుండా వెళ్లి పోయింది. మార్గమద్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఇరుక్కుపోయిన యువతుల కారును.. పది నిమిషాల పాటు వెంబడిస్తూ వస్తున్న పోలిసుల జీవు ఎట్టకేలకు నిలువరించింది. వారిని నిలిపి కారు రెడ్ సిగ్నల్ ఫడినా అగకుండా ఎందుకు వచ్చేశారంటూ వారిని నిలదీశారు. పోలీసులు వచ్చి తమను ప్రశ్నిస్తున్నా.. తప్పు జరిగింది.. మన్నించండీ అంటే పోయేదానికి వారితో వాదనకు దిగారు.
అప్పటికీ, అమ్మాయిలే కదా ఏదో ఒకటి సర్ది చెప్పి పంపిద్దామని పోలీసులు కూడా భావించారు. తప్పు తాము చేసి.. నేరం మాత్రం అవతలివాళ్లపై వేసినట్లుగా.. యువతులు రెడ్ సిగ్నల్ జంప్ చేసి.. మరోవైపు పోలీసులతో వాదనకు దిగారు. అంతేకాదు దారిన పోయేవారు వారిని సముదాయించి శాంతపర్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరిలో ఒక యువతి పోలీసులతో గొడవ పెట్టుకుంది. మరో యువతి కారులో ఉన్న బీర్ బాటిల్ తీసుకొచ్చి, తలమీద పగలగొట్టుకుంది. ఆ తర్వాత పోలీసులపై ఇద్దరూ కలిసి దాడికి దిగారు. నానా రచ్చ చేసి.. ఔరా వీళ్లు అమ్మాయిలేనా.. అనిపించేలా చేశారు.
దీంతో బిత్తెరపోయిన పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇద్దరు యువతులు సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా.. ఏకంగా తమపై విరుచుకుపడి తమ డ్రెస్ ను కూడా చించివేసి దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాంతో ఉన్నతాధికారుల అదేశాల మేరకు.. అప్పటికే సాయంత్రం 7 గంటలు కావస్తున్నందున వారిని అ రోజు వదిలేసి.. తెల్లవారే వరకు వేచిచూసి.. మరుసటి రోజు ఉదయం వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ మొత్తం తతంగాన్ని రొడ్డుపై వెళ్తున్న వాహనదారులు తమ మోబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. అది కాస్తా హల్ చల్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more