తమిళనాడులో దారుణం జరిగింది. తమిళనాడులోని కడలూరు పోలిస్ స్టేషన్ పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓ యువకుడి తలను నరికిన దుండగులు ఆ తలను సరాసరి తమిళనాడు జిల్లాలోని కడలూరు పోలిస్ స్టేషన్ లోకి విసిరేసి పారిపోయారు. నేరాలను చేధించే పోలీసులకు అగంతకులు సవాల్ విసిరారు. ఈ ఊహించని పరిణామంతో విస్మయానికి గురైన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమా అన్న కోణంతో పాటు అస్తుల లావాదేవీల వ్యవహారంతో పాటు అన్ని కోణాల్లో కడలూరు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
మృతుడ్ని పుదుచ్చేరికి చెందిన శ్వేతన్ గా గుర్తించిన పోలీసులు.. అతని శరీరాన్ని పుదుచ్చేరిలోని లోని బాహోర్ గ్రామంలో వున్న నది ఒడ్డున పూడ్చిపెట్టినట్లు కనుగొన్నారు. దీంతో అటు తమిళనాడులోని కడలూరు పోలిసులతో పాటు ఇటు పుదుచ్చేరి పోలీసులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శవాన్ని అస్పత్రికి పంపిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే యువకుడ్ని ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలపై విస్మయం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. మృతుడి బంధువులను కూడా విచారిస్తున్నారు.
పుదుచ్చేరికి చెందిన యువకుడి తలను ఏకంగా పోరుగు రాష్ట్రం తమిళనాడులోని పోలిస్ స్టేషన్ లో విసిరడంతో అతనిపై తీవ్రమైన కక్షవున్నవారే ఈ దారుణానికి ఒడిగట్టారని, ఇందుకు ప్రేమ వ్యవహరం కారణమా..? లేక దాయాదుల మధ్య అస్తుల పంపకాలు కారణమా.? అన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలిసులకు బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు యధేశ్చగా పోలిస్ స్టేషన్ ప్రధాన గేటు వద్ద బైక్ నిలిపి.. ఒక వ్యక్తి బైక్ పై నుంచి దిగి.. తలను తీసి పోలిస్ స్టేషన్ లోకి విసిరేసినట్లు స్పష్టంగా కనబడుతుంది. దీంతో బైక్ పై వచ్చిన ఇద్దరు ఎవరన్న విషయాలతో పాటు ఆ బైక్ నెండరు ఇతర సిసిటీవీ ఫూటేజీలలో లభ్యమైన వివరాలను తెలుసుకుంటూ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more