కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గలేదు. షాజాపూర్ జిల్లాలో బాంబు పేలుళ్లు, కాన్పుర్లో సైఫుల్లా ఎన్కౌంటర్పై తాము సమాచారం అందించకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని డీజీపీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటం చూశాం. మంత్రుల దగ్గరి నుంచి కింది స్థాయి నేతల దాకా అంతా డిగ్గీ రాజాపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పందించాడు.
తమ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే, ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరాడు. చాలా మందితో మాట్లాడి అధ్యయనం చేసి ఆధారాలు సేకరించిన తర్వాతే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పుకొచ్చాడు. ముస్లిం యువతను ట్రాప్ చేయడం నైతికంగా ఏమాత్రం సమర్థనీయం కాదన్న వీహెచ్, ఆరోపణల్లో అవాస్తవాలను తేల్చాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉందని చెప్పాడు. తెలంగాణ పోలీసుల వ్యూహం ఏదైనా కావచ్చుగానీ నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఐసిస్ వైపు ఆకర్షితులయ్యే ముస్లిం యువతను గుర్తించే విధానం సరికాదన్నాడు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, బీసీలకు ఆయన విలువ ఇవ్వడం లేదని, జ్యోతిరావ్ పూలే జయంతి నాడు ఆయనకు పూలదండ కూడా వేయలేదని ఆరోపించారు. ఖమ్మం మార్కెట్ యార్డు సంఘటనను ఉద్దేశించి దళారుల ప్రభుత్వంగా అభివర్ణించాడు. విద్యార్థుల దగ్గరికే కాదు.. కనీసం రైతుల వద్దకు కేసీఆర్ వెళ్లలేని స్థితికి చేరుకున్నాడని ఎద్దేవా చేశాడు. పనిలో పనిగా గవర్నర్ నరసింహన్ పదవీకాలం పొడిగింపుపై ఆయన వ్యాఖ్యలు చేశారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నంత కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగదని, ఈ విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తానని వీహెచ్ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more