పాక్ దాష్టీకమైన పనులపై దేశం మొత్తం అట్టుడుకిపోతుంది. సరిహద్దులు దాటి వచ్చిమరీ ఇద్దరు జవాన్ల తలలు నరకడంపై అంతా ఫైర్ అవుతున్నారు. ఓవైపు కేంద్రం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండగా, పాక్ పై దాడి చేసి నామరూపాలు లేకుండా చేయాలంటూ రాజకీయ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఈ విషయంపై ఓవైపు గళం వినిపిస్తూనే పనిలో పనిగా ప్రభుత్వం పై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు కొందరు.
ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ... పాకిస్థాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించింది. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు.. దేశ ప్రజల అభిమతం అని స్పష్టం చేసింది. పాక్ దుశ్చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. గోరక్షణ, లవ్ జిహాద్, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్, సరిహద్దులపై దృష్టి సారించాలని సెటైర్లు వేసింది. కేవలం రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయటంలో పెడుతున్న శ్రద్ధ, సైనికుల రక్షణ పై కూడా పెడితే బావుంటుందని తెలిపింది.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సైన్యానికి స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దేశ రక్షణలో కేంద్రం మరింత సమర్థవంతంగా కఠినమైన విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సరిహద్దుల్లో సైన్యానికి పూర్తి అధికారాలు ఇవ్వాలని, అలా చేస్తే...వారే ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన చెప్పారు. తాము అధికారంలో ఉండగా ఒకే ఒక్కసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూడుసార్లు పాకిస్థాన్ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టిందని, ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకుంటే లాభం లేదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు పాకిస్థాన్ కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని వామపక్షాలతో సహా అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో పిలుపునిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more