తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలను తన అనుభవంతో అత్యంత చాకచక్యంగా పరిష్కరించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. ఇప్పటికే తమకు గవర్నర్ నరసింహన్ సేవలను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కాగా మరో తెలుగు రాష్ట్రమైన అంధ్రప్రదేశ్ లో అధికారంలోని వున్న చంద్రబాబు సర్కార్ ఈ మేరకు త్వరలో కేంద్రాన్ని కోరుతూ ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం.
అయితే ఈలోగా గవర్నర్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వమే తాత్కాలికంగా పోడగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మౌఖిక అదేశాలను ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్గా కొనసాగాలని నరసింహన్ ను ఆదేశించింది. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్నీ వివాదాస్పద అంశాలు అపరిష్కృతంగా వున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేంత వరకు నరసింహన్ ను గవర్నర్ గా కోనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది.
తమిళనాడుకు చెందిన నరసింహన్ 2007 జనవరి 25న తొలిసారి ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2010 జనవరిలో బదిలీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. 2012 మే 3న మొదటి విడత పదవీకాలం ముగిసింది. కేంద్రం మళ్లీ ఇక్కడే నియమించింది. మంగళవారంతో ఆయన మూడో విడత పదవీకాలమూ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాత్కాలిక పొడగింపు ప్రకటించింది. జులైలో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నరసింహన్ను కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉంటాయని రాజకీయ వర్గాలు భావించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more