ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ చుక్కలు చూపెడుతుండగా, దానిని ధీటుగా ఎదుర్కోనేందుకు ఇటు పెట్రోలు బంకులు యజమానులు కూడా సిద్దమవుతున్నారు. పెట్రోలు బంకుల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సదరు బంకులపై అకస్మిక దాడులు చేయాలని అదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యాజామాన్యాలు ధర్నాకు దిగి నిరసనను తెలుపుతున్నాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం.. యాజమాన్య ప్రతినిధులతో ఎట్టకేలకు చర్యలు చేపట్టింది.
అయితే పెట్రోలు బంకుల యజమానులు చిప్ లాంటి పరికరాన్ని పెట్రోల్ పోసే మిషన్లో ఏర్పాటు చేసి.. తక్కువ మొత్తంతో పోసిన పెట్రోలుకు అధిక మొత్తం వసూళ్లు చేస్తుండటంతో.. ఈ బాగోతం బట్టభయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బంకులపై దాడులు చేసిన ఏకంగా 13 పెట్రోల్ బంకులను సీజ్ చేయగా, మరో రెండింటికి మాత్రం పెనాల్టీ వేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో అనేక చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని కొద్ది నిమిషాల ముందుగానే తెలుసుకున్న ఓ పెట్రోలు బంకు యజమానీ ఏకంగా పెట్రోలు పోసే యంత్రపరికరాన్ని దాచేసి బంకు పునర్నిర్మాణంలో వుందని బోర్డు పెట్టేశాడు. అయితే ఎస్టీఎప్ అధికారులు దానిని పసిగట్టి.. ఇలాంటి 'పునర్నిర్మాణంలో ఉన్న' పలు బంకులమీద కూడా దాడులు చేశారు. గత వారం రోజులుగా లక్నో పోలీసులు జరుపుతున్న దాడుల్లో వెయ్యి కన్నా అధికంగానే చిప్లు బయటపడ్డాయి. తద్వారా రోజుకు రూ. 15 లక్షల విలువైన పెట్రోలును బంకుల యాజమాన్యాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more