అడవాళ్లు అయితే చాలు అంగడి వస్తువనుకునే మగమృగాళ్లు వారిపై బడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఓ పన్నెండేళ్ల బాలిక గ్రామంలోని తమ బంధువుల ఇంటిలో వివాహవేడకలో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరై అర్థరాత్రి ఒంటిగంటకు ఇంటికి తిరిగివస్తుండగా, అమెను ముగ్గురు యువకులు అపహరించి.. స్థానికంగా వుంటే వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లి వరుసక్రమంలో బాలికపై దారుణానికి పాల్పడ్డారు. వంతుల వారిగా బాలికై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో వెలుగు చూసింది.
కియోంజర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక వివాహవేడుకకు ముందు పెళ్లికూతురుతో పూజ చేయించే పాలా కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దాలంగాపాణి గ్రామ శివార్లలో ఆమెను ముగ్గురు యువకులు పట్టుకొని స్థానికంగా వున్న వ్యవసాయ భూమిలోకి లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. నిందితులు 19నుంచి 25 ఏళ్ల వయసు వారేనని పోలీసులు చెప్పారు. వారిని గుర్తించిన బాలిక తనపై దారుణం చేయవద్దని ప్రాధేయపడుతున్నా ఆ పైశాచిక మృగాల మనస్సు కరగలేదు.
బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని డీఎస్పీ చంద్ర పాండే తెలిపారు. ఘటన తరువాత నిందితులంతా పరారీలో వున్నారని, అయినా వారిందరినీ వెతికి పట్టుకుని అరెస్టు చేశామని, వారిని న్యాయస్థానంలో హాజరుపరస్తున్నట్లు తెలిపారు. కాగా మైనర్ బాలుడు వయస్సును నిర్ధారించేందుకు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల అనుమతితో అమె రక్త నమూలను సేకరించి అమెకు చికిత్స కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరిపై పోస్కో చట్టంతో పాటు ఐపీసీ 376, 376(డి) సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more