చిత్తూరులో కాసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో మధ్యాహ్నం సమయంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పూతల పట్టు- నాయుడు పేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపుతప్పిన ఓ లారీ జనాలపైకి దూసుకెళ్లటంతో 20 మంది అక్కడిక్కడే మృతి చెందారు.
ముందుగా ఓ కరెంట్ పోల్ ను ఢీ కొట్టి ఆపై ఒక్కసారిగా అక్కడి షాపుల సముదాయంపైకి దూసుకెళ్లికింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రికి తరలించే క్రమంలో మరో ఐదుగురు చనిపోయారు. కరెంట్ షాక్ తోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.
పూతల పట్టు-నాయుడు పేట రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు పలు వాహనాల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more