జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రం జైలవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడానికి కారణమేంటి అంటున్నారా..? అయన సీనిమాలను పక్కనబెట్టి ఇక రాజకీయ ప్రవేశం చేయనున్నారని, ఇందుకోసం ఏకంగా ఓ కొత్త జాతీయ స్థాయి రాజకీయ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అదేంటి ఈ వార్తను నిజంగా నమ్మవచ్చునా... అంటే.. అది ఎవరికి వారు అలోచించుకోవాల్సిందే. అయితే తారక్ రాజకీయ ఎంట్రీపై ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతుంది.
‘నవ భారత్ నేషనల్ పార్టీ’కి ఏపీ అధ్యక్షుడిగా తారక్ ను నియమించామంటూ నెట్ లో హల్ చల్ చేసిన లేఖపై ఆయన అభిమానులు కూడా అశ్చర్యానికి వ్యక్తం చేశారు. అయితే కొందరు ఈ విషయాన్ని తమ నటుడి వద్దే అడిగి తెలుసుకుందామని ఏకంగా ‘జైలవకుశ’ సినిమా షూటింగ్ స్పాట్ లోకి వెళ్లి.. తారక్ తో ఈ విషయాన్ని చెప్పారట. దీంతో తారక్ రాజకీయ ఎంట్రీ అనగానే చిన్నగా ఓ నవ్వు నవ్వారట. తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట. అంతేగాకుండా తన అభిమానులు కూడా ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దని, వదిలేయాలని సూచించాడట.
అయితే ఏదో ఒక పార్టీ అండగను తీసుకుని రహస్యంగా రాజకీయ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని కూడా కుండబద్దలు కొట్టిమరీ చెప్పాశాడట. తానకు ఇప్పడప్పడే రాజకీయాల్లోకి రానని కూడా క్లారిటీ ఇచ్చేసిన తారక్.. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని చెప్పాడట. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించాడట. మొత్తానికి తన రాజకీయ ఎంట్రీపై తారక్ స్పష్టత ఇచ్చేశాడని, అయితే ఆయన ఎంట్రీ ఎప్పుడిస్తారోనని అభిమానులకు మాత్రం ఎదురుచూపు తప్పడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more