కూటి కోసం, కూలి కోసం పట్టణానికి బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అన్న శ్రీశ్రీ వ్యాఖ్యలు ఎంత నిజమో ఇట్టే అర్థమయ్యేలా చేస్తుందీ ఘటన. రెక్కాడితే గాని డొక్కాడని కష్ట జీవులు... పోట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చినా.. గత కొన్నేళ్లుగా బాగానే కలసివున్నారు. చిన్న విషయమైమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగడంతో ఒక్కరిని మరోకరి తోసివేయడం, అతను కింద పటడం.. తలకుబలంగా రాయి తగలడంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగిపోయాయి.
ముఫై రూపాయలు ఒక నిండు ప్రాణాలన్ని బలిగోంటుందని, అదీ తన స్నేహితుడి ప్రాణాలనే తీస్తుందని ఊహించని మృతుడి స్నేహితుడు.. మాత్రం నిచేష్టుడై పోలీసులు అదుపులో వున్నాడు. వివరారల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాజు, కమలేష్ ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరూ ఓల్డ సిటీలోని ఓ హోటల్లో వెయిటర్లుగా పనిచేస్తున్నారు. ఇక రాష్ట్రాలు దాటి వచ్చిన వీరికి పబ్లిక్ గార్డెన్స్ రాత్రి విడిదిని ఇస్తుంది. ప్రతిరోజు మాదిరిగానే అరోజు కూడా యధావిధిగా ఇద్దరు కలసి పని కోసం హోటల్ కు వెళ్లారు.
అరోజు ఓ కస్టమర్ కమలేష్ కు రూ.30 టిప్ ఇచ్చాడు. అదే ఇద్దరి మధ్యన గొడవకు దారి తీసింది. రూ.30లో తనకు కూడా వాటా ఇవ్వాల్సిందిగా కమలేష్ రాజును కోరాడు. టిప్పు తన కొచ్చిందంటూ …అందులో వాటా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటమాట పెరగిన క్రమంలో రాజును కమలేష్ తోసేసాడు. దీంతో కిందపడిన రాజు తలకు బలైమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తరలించారు. కమలేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more