పెద్దలు చేసిన పాపం ఇంటిల్లిపాదికి చుట్టుముడుతుందని ధర్మశాస్త్రాలు చదవిన పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇలాంటి పనే చేసిన నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు రితీశ్ తాను చేసిన తప్పుకు తన భార్యను కూడా పణంగా పెట్టాడు. అమెపై కూడా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. రితీశ్ తన పరిచయస్తుడ్ని రూ.2.18 కోట్ల మోసం కేసు నమోదైంది. రితీశ్ అవసరం మేరకు తన కుమారుడి నుంచి రూ.2.18 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును అశ్రయించడంతో ఈ కేసు నమోదైంది.
మాజీ పార్లమెంటు సభ్యుడు, నటుడైన రితీశ్ తో పాటు అతనికి సంబంధించిన వారు.. వారి అసవరాల మేరకు తన కుమారుడు నుంచి సుమారు రెండు కోట్ల 16 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్ని డబ్బును తిరిగి చెల్లించడం లేదని చెన్నైకి చెందిన ఆదినారాయణ్ సుబ్రమణియన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును అశ్రయించారు, శ్రీపెంరంబదూర్ లో వున్న మూడు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పూచికత్తుగా పెట్టారని, అయితే మూడేళ్లలో మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తామని చెప్పిన రితీశ్.. గత రెండేళ్లుగా చెల్లని చెక్కులను మాత్రమే ఇచ్చారని అరోపించారు.
చెక్కులు బౌన్స్ కావడంతో గత్యంతరం లేక తాను న్యాయస్థానాన్ని అశ్రయించానన్నారు. ఈ విషయమై తాను 2015లో పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అథినారాయణన్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేయాల్సిందిగా నవంబరు 12, 2015లో ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కేసును దర్యాప్తు చేయాల్సిందిగా చెన్నై నేర విభాగం పోలీసులకు గతేడాది ఆగస్టులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసినా దానిని పట్టించుకున్న పాపన పోని పోలీసుల తీరుపై మరోమారు అథినారాయణన్ న్యాయస్థానం తలుపుతట్టారు. ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ విచారించాలని సూచించినా ఎవరూ ముందుకురాలేదని.. న్యాయస్థానం అదేశాలు జారీ చేసి రెండేళ్లు కావస్తున్నా.. తమను ఎవరు పట్టించుకోలేదని ఆదినారాయణన్ మరోమారు కోర్టుకెక్కారు. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ధిక్కార పిటిషన్ను గత నెలలో విచారించిన కోర్టు నాలుగు వారాల్లో రితీశ్పై కేసు నమోదు చేయకుంటే పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో స్పందించిన పోలీసులు రితీశ్, ఆయన భార్య జ్యోతీశ్వరి తదితరులపై కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more