కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోడీ యావత్ దేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లేందుకు ప్రవేశపెట్టిన ప్రాజెక్టు స్వచ్ఛా భారత్. ప్రధాని మోడీ మానసపుత్రికగా పేరొందిన ఈ ప్రాజెక్టుతో శుభ్రత, పరిశుభ్రతల దేశంగా తీరచిదిద్దాలనే. అయితే ప్రధాని కలగనగానే దేశం యావత్తు శుభ్రమైపోదు. అయితే నా దేశం శుభ్రమైంది అని, ప్రతి పౌరుడు నినదించడంతో పాటు అందుకు తన వంతుగా శ్రమిస్తే.. తప్పక దేశం స్వచ్చగా అవతరిస్తుందని అనడం అతిశయోక్తి కాదు.
అయితే అందుకు కొంత సమయం కూడా పడుతుందన్నది జగమెరిగిన సత్యం. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, రాజకీయాలకు సంబంధించిన అంశం అంతకన్నా కాదు. దీంతో ఈ ప్రాజెక్టుకు దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరూ నడుంబిగించాల్సిన అవసరం వుంది. ఇలా భావించే కర్ణాటకకు చెందిన అకాష్ జైన్ అనే వ్యక్తి తన వంతుగా తన చెల్లి పెళ్లికి వివాహ అహ్వాన పత్రికలో స్వచ్ఛా భారత్ లోగోను ముద్రించి.. అందరినీ అశ్చర్యంలో ముంచెత్తాడు. దానిని తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేశాడు.
అంతే ఇంకేముంది ఒక్కసారిగా అతనికి బొలెండంత పబ్లిసిటీ వచ్చేసింది. అదెలా అంటారా..? ఈ వివాహ అహ్వాన పత్రిక ట్విట్టర్ పోస్టుపై ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ రీట్విట్ చేశారు. అంతేకాదు తాను ఫాలో అవుతున్న సుమారు రెండు వేల మందిలో అకాష్ జైన్ ను కూడా కలుపుకున్నారు. అంతే ఇక అకాష్ అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంతలా అంటే అప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా వస్తున్న ప్రశంసలు మునుపెన్నడూ లేనంతగా.
ఈ సందర్భంగా అకాష్ జైన్ అటు మీడియాకు, ఇటు సోషల్ మీడియాలోనే సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారారు. అయితే ఇదంతా తన గోప్పదనం కాదని, తన తండ్రి సూచలను మేరకు అలా చేశానని చెప్పుకోచ్చాడు. తన తండ్రి ప్రధాని నరేంద్రమోడీని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తప్పక ఫాలో అవుతుంటారని, అందులో భాగంగానే తన కూతురి వివాహ ఆహ్వాన పత్రికలో చివరగా స్వచ్ఛ భారత్ లోగోను ప్రింట్ చేయించి.. వాటిని తన బంధుమిత్రులకు పంచాడని చెప్పుకోచ్చాడు. ఏదేమైనా కేంద్రప్రభుత్వ పథకానికి ఇలా ప్రచారం కల్పించిన యువకుడి వినూత్న ఐడియా అదుర్స్ కదూ.
Dear @narendramodi, My dad specifically wanted @swachhbharat logo to be there on my sister's wedding invitation, hence got it. @PMOIndia pic.twitter.com/kD28savm82
— Akash Jain (@akash207) April 1, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more