పెళ్లంటే నూరేళ్ల పంట. మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఆరంభమయ్యే అనుబంధం. ఆరంభంలో అభిప్రాయభేధాలు వచ్చినా అలా అలా పెనవేసుకుపోయి.. చివరకు గొప్ప అనుభంధాలను అనుభూతులను మిగిల్చే నూరేళ్ల వసంతాల పండుగగా మారిపోతుంది. అది మన వివాహబంధంలోని గొప్పదనం. ఎన్ని కష్టాలు వచ్చినా కడదాకా కలసి ఉండడం, ఒకరికోసం మరోకరు ఎంతో శ్రమకోరూస్తూ, సంతోషం, ధు:ఖంలోనే ఒకరికొకరు తోడుగా వుండటమే వైవాహిక బంధం.
అయితే చదువులేని నిరక్షరాస్యులు కూడా చేయని విధంగా వ్యవహరించిన సాప్ట్ వేర్ ఇంజనీరు మాత్రం అత్యంత దారుణంగా వ్వవహరించి వార్తల్లో నిలిచాడు. పెళ్లి చేసుకోగానే తనకు రావాల్సిన వరకట్నం ఇంకా చేతిలో పడలేదని, కట్నకానుకల లెక్కకుదిరితేనే శోభన ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటామని చెప్పి వార్తల్లో నిలిచాడు. ఇలా పెళ్లైందో లేదో.. అలా తన అర్థాంగి వదిలి తన తల్లిదండ్రులతో కలసి తన నివాసానికి చేరుకున్నాడు.వరకట్నం బకాయి చెల్లించేవరకు తొలిరాత్రికి ససేమిరా అన్నాడు.
గత ఏడాది మే నెలలో బసవేశ్వరనగర్ గణపతి లే అవుట్కు చెందిన మహేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో ఓ బెంగళూరుకు చెందిన ఓ స్థానిక యువతికి వివాహం జరిగింది. అయితే కట్నం డబ్బు చేతిలో పడేదాక శోభనాన్ని కూడా వాయిదా వేసుకుంటామని మహేష్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా వధువు తల్లిదండ్రులకు తేల్చిచెప్పారు. వధువు తల్లిదండ్రులు నగదు సమకూర్చలేకపోవడంతో అమె అమ్మగారింటికే పరిమితమైంది. పెళ్లైన కూతురు ఏడాది కాలం కావస్తున్న ఇంకా ఇంట్లోనే వుండటంతో ఇరుగుపోరుగు వారు కూడా అనేక అవమానాల పాటు చేశారు.
ఇది చాలదన్నట్లు తన భర్త మరో పెళ్లికి సిద్దమవుతున్నాడని తెలుసుకున్న వదువు.. సరాసరి అత్తగారింట కాలుమేపింది. అయితే అమె భర్తతో పాటు అత్తామామలు అమెను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బలవంతం చేయడంతో అమె చేసేది లేక స్థానిక బసవేశ్వర నగర్ పోలీసులను ఆశ్రయించింది. అత్తామామాలు శకుంతల, శివనారాయణతో పాటు తన భర్తపై కూడా పిర్యాదు చేసింది. అయితే వారిని స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు ముందుగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కట్నం కోసం కటకటాలు కావాలా..? లేక కొడలితో సఖ్యతగా వుంటూ మనవడు, మనవరాలితో కూడిన సంతోషం కావాలా అని అడుగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more