చెప్పుకోవటానికి సిల్లీగా అనిపించినప్పటికీ చైనా లో టాయ్ లెట్ పేపర్ల దొంగలు భారీ ఎత్తునే నష్టాన్ని కలిగిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పేపర్ విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. గత ఒక్క ఏడాదిలోనే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 30 నుంచి 40 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే వాటిని చెక్ పెట్టేందుకు ఇప్పడు అక్కడి వ్యాపారస్థులు ఓ కొత్త ఉపాయం కనిపెట్టారు.
టాయ్ లెట్స్ లోని పేపర్ రోల్స్ కి సాంకేతిక టెక్నాలజీతో సెన్సార్ లను ఏర్పాటు చేస్తున్నారు. పేపర్ కోసం దాని ముందు నిలబడగానే అది స్కాన్ చేసేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ తోపాటు, ఫేస్ ను కూడా స్కానింగ్ చేస్తుంది. ఒక వ్యక్తి రెండు సార్లు తీసినా లేక అవసరంకు మించి లాగిన టిష్యూ పేపర్ ముఖానికి డిటెక్ట్ చేస్తుంది. పొరపాటున ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే వెంటనే ఆ ఫోటోను డేటాలో సేవ్ చేస్తుంది. ఆపై దానిని అధికారులు పబ్లిక్ ప్లేస్ లలో టాయ్ లెట్ పేపర్ దొంగల లిస్ట్ లో ఉంచేస్తారు.
ప్రస్తుతం చైనాలోని పాపులర్ ప్లేస్ ‘టెంపుల్ ఆఫ్ హెవెన్’ బాత్ రూంలలో దీనిని మొదలుపెట్టగా, అది సత్పలితాలను ఇస్తోంది. ఎవ్వరూ చూడలేదని జేబుల్లో పెట్టుకుని పోతే మాత్రం వారి పరువు పోయినట్లే. గతంలో ఒలంపిక్స్ సందర్భంగా బర్డ్ నెస్ట్ స్టేడియం వద్ద కూడా సరిగ్గా ఇలాంటి ప్రయోగాన్నే అమలు జరిపి విజయం సాధించారు నిర్వాహకులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more